Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తూ 270 మంది చనిపోయారు...

Webdunia
సోమవారం, 29 ఏప్రియల్ 2019 (10:13 IST)
ఇండోనేషియా దేశంలో 270 మంది చనిపోయారు. ఈ దేశంలో ఎలాంటి ప్రకృతివిపత్తు సంభవించలేదు. ఎలాంటి సునామీలు రాలేదు. కానీ, 270 మంది మృత్యువాతపడ్డారు. దీనికి కారణం.. చనిపోయిన వారంతా బ్యాలెట్ ఓట్లను లెక్కించడమే. ఈ విషయాన్ని ఆ దేశం అధికారికంగా కూడా ప్రకటించింది. 
 
ఇటీవల ఇండొనేషియాలో అధ్యక్ష పదవికి సంబంధించి ప్రాంతీయ, జాతీయ పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 26 కోట్ల మంది ఉన్న జనాభాకు ఒకే విడతలో ఎన్నికల సంఘం పోలింగ్ నిర్వహించింది. దాదాపు 19 కోట్ల మంది ఓటర్లు ఉన్న ఇండోనేషియాలో 80 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఒక్కో ఓటరు ఐదు బ్యాలెట్ పేపర్లలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. 
 
మే 22న ఈ ఎన్నికల ఫలితాలు వెలువడనుండటంతో.. ఎన్నికల సిబ్బంది రేయింబవళ్లు కోట్లాది బ్యాలెట్ పేపర్లను చేతులతో కౌంటింగ్ చేయాల్సి వస్తోంది. దీంతో అలసటకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ వందలాది సిబ్బంది ప్రాణాలను కోల్పోతున్నారు. ఇండోనేషియా ఎన్నికల సంఘం అధికారుల లెక్కల మేరకు... ఇప్పటివరకు మొత్తం 272 మంది ఎన్నికల సిబ్బంది చనిపోగా, 1,878 మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

తర్వాతి కథనం
Show comments