బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తూ 270 మంది చనిపోయారు...

Webdunia
సోమవారం, 29 ఏప్రియల్ 2019 (10:13 IST)
ఇండోనేషియా దేశంలో 270 మంది చనిపోయారు. ఈ దేశంలో ఎలాంటి ప్రకృతివిపత్తు సంభవించలేదు. ఎలాంటి సునామీలు రాలేదు. కానీ, 270 మంది మృత్యువాతపడ్డారు. దీనికి కారణం.. చనిపోయిన వారంతా బ్యాలెట్ ఓట్లను లెక్కించడమే. ఈ విషయాన్ని ఆ దేశం అధికారికంగా కూడా ప్రకటించింది. 
 
ఇటీవల ఇండొనేషియాలో అధ్యక్ష పదవికి సంబంధించి ప్రాంతీయ, జాతీయ పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 26 కోట్ల మంది ఉన్న జనాభాకు ఒకే విడతలో ఎన్నికల సంఘం పోలింగ్ నిర్వహించింది. దాదాపు 19 కోట్ల మంది ఓటర్లు ఉన్న ఇండోనేషియాలో 80 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఒక్కో ఓటరు ఐదు బ్యాలెట్ పేపర్లలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. 
 
మే 22న ఈ ఎన్నికల ఫలితాలు వెలువడనుండటంతో.. ఎన్నికల సిబ్బంది రేయింబవళ్లు కోట్లాది బ్యాలెట్ పేపర్లను చేతులతో కౌంటింగ్ చేయాల్సి వస్తోంది. దీంతో అలసటకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ వందలాది సిబ్బంది ప్రాణాలను కోల్పోతున్నారు. ఇండోనేషియా ఎన్నికల సంఘం అధికారుల లెక్కల మేరకు... ఇప్పటివరకు మొత్తం 272 మంది ఎన్నికల సిబ్బంది చనిపోగా, 1,878 మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పవన్ కళ్యాణ్ "ఓజీ"

నాకేం కాలేదు.. అంతా బాగానే వుంది... మా కారుకు దెబ్బ తగిలింది : విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ కారు ప్రమాదం.. హీరో సురక్షితం

Balakrishna: చిరంజీవి, బాలక్రిష్ణ సినిమాలు ఆగిపోవడానికి వారే కారకులా!

Naga Shaurya: మాస్ హీరోగా నిలబడేందుకు కష్టపడుతున్న నాగ శౌర్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments