Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి పడి ఉద్యోగం ఊడగొట్టుకున్న భారతీయుడు.. ఎక్కడ?

వరుణ్
గురువారం, 25 ఏప్రియల్ 2024 (15:42 IST)
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తిపడిన ఓ భారతీయుడు ఉద్యోగం ఊడగొట్టుకున్నాడు. ఈ ఘటన కెనడాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మేహుల్ ప్రజాపతి అనే వ్యక్తి ఓ డేటా సైంటిస్ట్. కెనడాలోని టీడీ బ్యాంకులో పనిచేస్తున్నాడు. అతడి జీతం ఏడాదికి 98 వేల డాలర్లు. జీవితంలో ఉన్నతస్థితికి చేరుకున్న మేహుల్.. తాను ఉచిత ఆహారంతో ఎంత డబ్బు పొదుపుచేసిందీ చెబుతూ ఓ వీడియో చేశాడు. 
 
స్థానికంగా అందుబాటులో ఉన్న ఫుడ్ బ్యాంకుల నుంచి ఆహారం, పచారీ సామాన్లు తీసుకుంటూ వందల కొద్దీ డాలర్లు పొదుపు చేసినట్టు అతడు గర్వంగా చెప్పుకొచ్చాడు. బీదసాదలు, విద్యార్థులను ఆదుకునేందుకు విదేశాల్లో స్వచ్ఛంధ సంస్థలు, ప్రభుత్వాలు ఫుడ్‌బ్యాంక్స్ ఏర్పాటు చేస్తుంటాయి. ఆర్థిక కష్టాల్లో ఉన్నవాళ్లు ఇక్కడి ఆహారంతో కడుపునింపుకుంటూ సేద తీరుతుంటారు. స్థానికులు చాలా మంది ఫుడ్ బ్యాంక్స్‌కు వెళ్లడం అవమానంగా భావిస్తారు. విధిలేని పరిస్థితుల్లోనే ఫుడ్ బ్యాంక్స్‌ను ఆశ్రయిస్తారు.
 
మంచి ఆదాయం ఉండి కూడా మేహుల్ ఫుడ్ బ్యాంకును ఆశ్రయించడం అనేక మందికి ఆగ్రహం తెప్పించింది. పేదల కోసం ఉద్దేశించిన పుడు దొంగిలిస్తున్నాడంటూ అతడిని తిట్టిపోశారు. ఇంతటి సిగ్గుమాలిన పని చేయడం తామెప్పుడూ చూడలేదని అన్నారు. ఈ విషయం వైరల్ కావడంతో మేహుల్ పనిచేస్తున్న బ్యాంకు అతడిని ఉద్యోగం నుంచి తొలగించింది. ఈ విషయాన్ని ఓ ప్రకటన ద్వారా ప్రజలకు తెలియజేసింది. దీంతో, మేహుల్‌కు తగిన శాస్తి జరిగిందంటూ పలువురు హర్షం వ్యక్తం చేశారు. కొందరు మాత్రం అతడి పరిస్థితిపై జాలిపడ్డారు. తెలిసో తెలియకో ఉచిత ఫుడ్ కోసం, వ్యూస్ కోసం కక్కుర్తి పడి చివరకు పరువు పోగొట్టుకున్నాడంటూ విచారం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments