Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ అప్రమత్తం.. ఆప్ఘన్ నుంచి రావాలంటే ఈ వీసా తప్పనిసరి

Webdunia
గురువారం, 26 ఆగస్టు 2021 (14:10 IST)
ఆఫ్ఘనిస్తాన్ పరిణామాల నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. ఆఫ్ఘన్‌లో తాలిబన్ల పాలన ఏర్పడటంతో దౌత్యపరంగా భారత్ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఆంక్షల్ని కఠినం చేస్తోంది.
 
మారుతున్న ఆఫ్ఘన్ పరిణామాల్ని పొరుగు దేశమైన ఇండియా ఓ కంట కనిపెడుతోంది. ఆఫ్ఘన్‌కు సరిహద్దు దేశమైన పాకిస్తాన్ తాలిబన్లకు వత్తాసు పలకడంతో కేంద్ర హోంశాఖ అప్రమత్తమైంది. దౌత్యపరంగా ఇండియా కొన్ని కీలక నిర్ణయాల్ని తీసుకుంటోంది. ఆఫ్ఘన్ నుంచి ఇండియాకు రావాలంటే ఈ వీసా తప్పనిసరి అంటోంది. 
 
ఇండియాకు వచ్చే విమాన మార్గంలో ఈ వీసా ఉంటేనే ఆఫ్ఘన్ పౌరుల్ని అనుమతిస్తామని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. ఎమర్జెన్సీ వీసా తీసుకోవాలంటే అక్కడి రాయబార కార్యాలయానికి నేరుగా వెళ్లి దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. 
 
సంక్షోభ పరిస్థితుల కారణంగా ఎంబసీను మూసేయడంతో ఈ వీసా(E Visa) దరఖాస్తు అనివార్యమైంది. ఈ వీసా ఆరు నెలల వరకూ చెల్లుబాటవుతుంది. సాధారణ వీసాలు లభ్యమై..ఇండియాకు చేరకపోతే ఆ వీసాలు చెల్లుబాటు కావు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

Priyanka Arul : ఓజీ చిత్రం నుండి ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్

వివాదంలోకి నెట్టిన ది బెంగాల్ ఫైల్స్ ట్రైలర్ - కొల్ కత్తాలో ప్రీరిలీజ్ వాయిదా

ఈ ఫ్లూకీతో పాటు 6 వీధి కుక్కలు ఇప్పుడు నా కుటుంబం: నటి వామికా గబ్బీ (video)

Rajinikanth: 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రజనీకాంత్.. ప్రధాని శుభాకాంక్షలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

తర్వాతి కథనం
Show comments