Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ కరోనాతో అతలాకుతలం: సాయం చేసేందుకు సిద్ధమన్న చైనా

Webdunia
గురువారం, 22 ఏప్రియల్ 2021 (23:01 IST)
కరోనావైరస్ కారణంగా భారతదేశం అతలాకుతలం అవుతోందనీ, అక్కడ పరిస్థితులు దారుణంగా వున్నాయని, మందుల కొరత తలెత్తుతోందనీ, తాము అవసరమైన సాయం చేసేందుకు సిద్ధంగా వున్నామని చైనా ప్రకటించింది.

మహమ్మారి కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తోందనీ, ఈ క్లిష్ట సమయంలో పరస్పర సాయం చేసుకోవడం ఎంతో అవసరమని గురువారం నాడు మీడియాతో చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ తెలిపారు.
 
కరోనాను అదుపులోకి తెచ్చేందుకు భారతదేశానికి అవసరమైన అన్నిరకాల సాయం చేసేందుకు చైనా సిద్ధంగా వుందని తెలిపారు. కాగా దేశంలో కరోనా కేసులు రాకెట్ వేగంతో నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3,14,835 కరోనా కేసులు నమోదవగా 2,104 మంది మృతి చెందారు.

కరోనా వచ్చిన తర్వాత దేశంలో ఒకేరోజు ఈ స్థాయిలో మరణాలు నమోదు కావడం ఇదే తొలిసారి. మరోవైపు దేశంలో మొత్తం 1.59 కోట్లు కరోనా కేసులు నమోదవగా మరణించినవారి సంఖ్య 1,84,657కి పెరిగింది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments