Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచానికి భారత్ ఆశాకిరణం : ప్రశంసల వర్షం కురిపించిన బిల్ గేట్స్

Webdunia
గురువారం, 23 ఫిబ్రవరి 2023 (11:31 IST)
భారతదేశంపై మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రపంచానికి భారత్ ఒక ఆశాకిరణంలా నిలిచిందని ఆయన కొనియాడారు. పైగా, ఏకకాలంలో అనేక సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని చేతల ద్వారా నిరూపించిందని ఆయన గుర్తుచేశారు. ఈ మేరకు ఆయన గేట్స్ నోట్స్ పేరిట తన బ్లాగులో భారత్‌ను ప్రశంసిస్తూ కొన్ని వ్యాఖ్యలు రాశారు. 
 
ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న భారీ సమస్యలను ఏకకాలంలో ఎదుర్కోవచ్చన్న నమ్మకం తనకుందని చెప్పారు. ఇందుకోసం సరైన ఆవిష్కరణలు, వాటి ఫలాలు ప్రజలకు అందేలా సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. అయితే, ప్రస్తుత సమస్యలను ఎదుర్కొనేందుకు కావాల్సిన డబ్బు, సమయం అందుబాటులో లేవని కొందరు తరచూ తనతో వ్యాఖ్యానిస్తుంటారని తెలిపారు. ఈ భవన తప్పని భారత్ రుజువు చేసిందన్నారు. 
 
"ఇది తప్పని చెప్పేందుకు భారత్‌కు మించిన నిదర్శనం మరొకటి లేదు. భారత్ ఇటీవలికాలంలో అద్భుతమైన ప్రగతి సాధించింది. ప్రపంచానికి ఆశాకిరణంగా నిలిచింది. భారీ సవాళ్ళను ఏకకాలంలో ఎదుర్కోవచ్చని నిరూపించింది. భారత్  పోలియో వ్యాధిని పారద్రోలింది. హెచ్.ఐ.వి. వ్యాప్తికి అడ్డుకట్ట వేసింది. పేదరికం, శిశుమరణాలను గణనీయంగా తగ్గించింది. పారిశుధ్యం, ఆర్థికసేవలను అధికశాతం మందికి అందుబాటులోకి తెచ్చింది" అని బిల్ గేట్స్ తన నోట్స్‌లో రాసుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ కాంబినేషన్ చిత్రం #సింగిల్‌ రివ్యూ

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments