Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూకేకు భారత్ దెబ్బ

Webdunia
శుక్రవారం, 1 అక్టోబరు 2021 (22:47 IST)
ఇటీవల అంతర్జాతీయ ప్రయాణ నిబంధనలను సవరించిన యూకేకు దీటుగా భారత్ స్పందించింది. యూకేలాంటి నిబంధనే యూకే పౌరులకు కూడా విధించింది. ఈ నెల 4 నుంచి భారత్ రావాలనుకునే యూకే పౌరులకు ఆర్టీ-పీసీఆర్ టెస్టు నెగటివ్ రిపోర్టు తప్పనిసరి అని పేర్కొంది.

అలాగే, భారత్‌లో అడుగుపెట్టడంతో 10 రోజుల తప్పనిసరి క్వారంటైన్‌లో ఉండాలంటూ తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది. యూకేలో వ్యాక్సినేషన్ కార్యక్రమం నత్తనడకన సాగుతుండడం కూడా భారత్ నిర్ణయానికి ఓ కారణం. 
 
ప్రభుత్వ తాజా నిబంధనలు:
* అక్టోబరు 4 నుంచి తాజా నిబంధనలు వర్తిస్తాయి
* ప్రయాణానికి 72 గంటల ముందు చేయించుకున్న ఆర్టీ-పీసీఆర్ టెస్టు నెగటివ్ రిపోర్టు తప్పనిసరి
* భారత్ చేరుకున్న తర్వాత మరోమారు ఆర్టీ-పీసీఆర్ పరీక్ష చేయించుకోవాలి
* దేశంలో అడుగుపెట్టిన 8 రోజుల తర్వాత మరోమారు ఆర్టీ-పీసీఆర్ పరీక్ష చేయించుకోవాలి
* ఇండియాకు చేరుకున్న తర్వాత ఇంటిలో కానీ, గమ్యస్థాన ప్రదేశంలో కానీ 10 రోజులపాటు తప్పనిసరిగా క్వారంటైన్‌లో ఉండాలి  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments