Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీలో తగ్గిన కరోనా.. 24 గంటల్లో కొత్తగా 809 పాజిటివ్ కేసులు

ఏపీలో తగ్గిన కరోనా.. 24 గంటల్లో కొత్తగా 809 పాజిటివ్ కేసులు
, శుక్రవారం, 1 అక్టోబరు 2021 (18:08 IST)
ఏపీలో కరోనా వైరస్ రోజుకీ తగ్గుముఖం పడుతోంది. ఏపీలో నిన్న పెరిగిన కరోనా కేసులు ఇవాళ మళ్లీ కాస్త తగ్గాయి. తాజాగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 809 కరోనా కేసులు నమోదయ్యాయి.
 
దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,51,133కి పెరిగింది. ఒక్క రోజు వ్యవధిలో మరో 10 మంది చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 186 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 11, 142 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి.
 
ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 56, 463 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 2,83,50,67 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇక గడిచిన 24 గంటల్లో 1, 160 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆన్‌లైన్ టిక్కెటింగ్‌కు సినీ పెద్దలు సమ్మతించారు : మంత్రి ఆదిమూలపు