Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మెడికల్‌ కాలేజీలో కరోనా కలకలం: 29 మంది విద్యార్థులకు పాజిటివ్

మెడికల్‌ కాలేజీలో కరోనా కలకలం: 29 మంది విద్యార్థులకు పాజిటివ్
, గురువారం, 30 సెప్టెంబరు 2021 (16:34 IST)
మహారాష్ట్ర ముంబైలోని కేఈఎం మెడికల్‌ కాలేజీలో కరోనా కలకలం సృష్టించింది. 29 మంది విద్యార్థులకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అయితే, ఇందులో 27 మంది రెండు డోసుల కొవిడ్‌ టీకా తీసుకున్నారు. 29 మంది విద్యార్థుల్లో 23 మంది ఎంబీబీఎస్‌ సెకండియర్‌ చదువుతుండగా.. ఆరుగురు మొదటి సంవత్సరం విద్యార్థులు. 
 
ఇందులో ఇద్దరు విద్యార్థులను చికిత్స కోసం సెవెన్‌ హిల్స్‌ ఆసుపత్రిలో చేర్చారు. మిగిలిన వారందరినీ ఐసోలేషన్‌కు తరలించారు. కళాశాలలో మొత్తం 1100 మంది వైద్య విద్యార్థులు ఉన్నారని కేఈఎం హాస్పిటల్‌ డీన్‌ హేమంత్‌ దేశ్‌ముఖ్‌ తెలిపారు.
 
కరోనావైరస్ కేసులు తగ్గడం మరియు టీకాలు వేగం పెరగడంతో అనేక కళాశాలలు మరియు పాఠశాలలు తెరవడం ప్రారంభించాయి. ఏదేమైనా, దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ఇటీవల విద్యార్థులు కోవిడ్ పాజిటివ్ పరీక్షించిన కేసులు బయటపడ్డాయి. ఇప్పటికే కర్ణాటకలోని బెంగుళూరులోని ఒక రెసిడెన్షియల్ స్కూలులో దాదాపు 500 మంది విద్యార్థులలో 60 మంది పాజిటివ్‌గా తేలింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బద్వేలు ఉప ఎన్నికపై సీఎం క్యాంప్ కార్యాలయంలో జగన్‌ సమావేశం