Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హిమపాతంలో చిక్కుకుపోయిన నేవీ అధికారులు.. ఎక్కడ?

Advertiesment
Navy
, శుక్రవారం, 1 అక్టోబరు 2021 (17:28 IST)
హిమాలయాల్లోని త్రిశూల పర్వతాల అధిరోహణకు వెళ్లి భారీ హిమపాతంలో చిక్కుకుపోయిన ఇండియన్ నేవీకి చెందిన అయిదుగురి కోసం గాలింపు, సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇండియన్ నేవీకి చెందిన 20 మంది బృందం త్రిశూల పర్వతాల అధిరోహణకు ముంబయి నుంచి సెప్టెంబర్ 3న బయలుదేరింది.
 
ఒక పర్వత శిఖరాగ్రానికి చేరేందుకు వీరిలో 10 మంది బృందం శుక్రవారం(అక్టోబర్ 1) ముందుకు కదిలింది. శిఖరాగ్రానికి అత్యంత సమీపంలో వారు భారీ హిమపాతంలో చిక్కుకుపోయారు. ఆ పదిమందిలో అయిదుగురిని కాపాడగలిగారు. 
 
మిగతా అయిదుగురి కోసం గాలింపు, సహాయక చర్యలు చేపట్టారు. భారత సైన్యం, భారత వాయు సేన, ఉత్తరాఖండ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ దళాల సహాయంతో ఇండియన్ నేవీ ఈ గాలింపు, సహాయ చర్యలు చేపట్టింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రపంచ రికార్డు : 127 జీవించిన వృద్ధుడు... ఎక్కడ?