Webdunia - Bharat's app for daily news and videos

Install App

పతనావస్థకు పాకిస్థాన్ ఆర్థిక రంగం : పాక్ ప్రధాని ఇమ్రాన్

Webdunia
గురువారం, 25 నవంబరు 2021 (10:48 IST)
పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా, తమ దేశ ఆర్థిక పరిస్థితిని బహిర్గతం చేశారు. దేశాన్ని నడిపేందుకు తమ వద్ద నిధులు లేవంటూ ప్రకటించి బాంబు పేల్చారు. దీంతో ప్రజా సంక్షేమ పథకాలపై పెద్ద మొత్తంలో నిధుల్ని ఖర్చు చేయలేమని తెగేసి చెప్పారు. 
 
దేశ ఆర్థిక రంగం పతనావస్థకు చేరుకోవడానికి విదేశీ అప్పులు పెరిగిపోవడం, దేశీయంగా పన్ను వసూళ్లు గణనీయంగా తగ్గిపోవడం వంటి అనేక కారణాలు ఉన్నాయన్నారు. దీంతో దేశ రక్షణ రంగానికి కూడా తగినన్ని నిధులను కేటాయించలేని పరిస్థితి ఏర్పడిందని, ప్రస్తుత పరిస్థితుల నుంచి గట్టెక్కడానికి మరోమారు విదేశీ రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. 
 
ముఖ్యంగా, గత నాలుగు నెలల్లో ప్రభుత్వం ఏకంగా 3.8 బిలియన్ డాలర్ల మేరకు అప్పులు చేసిందని గుర్తుచేశారు. ఈ అప్పుల ఊబి నుంచి బయటపడాలంటే ప్రజలు భారీ ఎత్తున పన్నులు చెల్లించాలని ఇస్లామాబాద్ నగరంలో బ్యూరో ఆఫ్ రెవెన్యూ విభాగంలో ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments