Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌తో ఎందుకు పెట్టుకుంటారు.. కాలుదువ్వితే నష్టపోయేది మీరే.. పాక్‌కు క్లాస్ పీకిన ఐఎంఎఫ్

ఠాగూర్
ఆదివారం, 18 మే 2025 (23:51 IST)
భారత్‌తో ఎదుకు ఘర్షణ పడతారని, అలా చేయడం వల్ల అపారంగా నష్టపోయేది మీరేనంటూ పాకిస్థాన్‌కు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) తలంటింది. పైగా, పాకిస్థాన్ వినతి మేరకు ఒక బిలియన్ డాలర్ల నిధులను ఇచ్చేందుకు సమ్మతించిన ఐఎంఎఫ్.. నిధుల విడుదలకు ముందు అనేక షరతులు విధించింది. 
 
అంతేకాకుండా, భారత్‌తో ఉద్రిక్తలు ఇంకా పెంచుకోవడం వల్ల మీకే (పాక్) ఎక్కువ సమస్యలు, నష్టమని తేల్చి చెప్పింది. ఈ ఘర్షణల వల్ల దేశంలో ఆర్థిత, బాహ్య సంస్కరణల లక్ష్యాలకు ముప్పు కలిగిస్తాయని హెచ్చరించింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల వల్ల స్టాక్ మార్కెట్ మొదట నష్టాల్లోకి వెళ్ళినప్పటికీ ప్రస్తుతం స్థిరంగా ఉన్నాయని ఐఎంఎఫ్ నివేదికలు పేర్కొన్నాయి. 
 
ఐఎంఎఫ్ ఇస్తున్న నిధులను పాక్‍‌ అభివృద్ధికి కాకుండా ఉగ్రవాదలను పెంచి పోషించడానికి వినియోగిస్తోందంటూ భారత్ ఇటీవల ఆరోపించింది. ఆపరేషన్‌ సిందూర్‌లో ధ్వంసమైన ఉగ్రవాద స్థావరాలను పునర్నిర్మంచడానికి జైషే మొహ్మద్ చీఫ్ అసూద్ ఆజాద్‌కు పాకిస్థాన్ రూ.14 కోట్లు ఇస్తున్నట్టు పాక్ ప్రభుత్వం ప్రకటించిందని పేర్కొంది. ఇలాంటి విషయాలన్ని ఐఎంఎఫ్ ముందు భారత్ ప్రస్తావించినప్పటికీ పాకిస్థాన్‌కు మాత్రం ఐఎంఎఫ్ నిధులు మంజూరు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments