భారత్‌తో ఎందుకు పెట్టుకుంటారు.. కాలుదువ్వితే నష్టపోయేది మీరే.. పాక్‌కు క్లాస్ పీకిన ఐఎంఎఫ్

ఠాగూర్
ఆదివారం, 18 మే 2025 (23:51 IST)
భారత్‌తో ఎదుకు ఘర్షణ పడతారని, అలా చేయడం వల్ల అపారంగా నష్టపోయేది మీరేనంటూ పాకిస్థాన్‌కు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) తలంటింది. పైగా, పాకిస్థాన్ వినతి మేరకు ఒక బిలియన్ డాలర్ల నిధులను ఇచ్చేందుకు సమ్మతించిన ఐఎంఎఫ్.. నిధుల విడుదలకు ముందు అనేక షరతులు విధించింది. 
 
అంతేకాకుండా, భారత్‌తో ఉద్రిక్తలు ఇంకా పెంచుకోవడం వల్ల మీకే (పాక్) ఎక్కువ సమస్యలు, నష్టమని తేల్చి చెప్పింది. ఈ ఘర్షణల వల్ల దేశంలో ఆర్థిత, బాహ్య సంస్కరణల లక్ష్యాలకు ముప్పు కలిగిస్తాయని హెచ్చరించింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల వల్ల స్టాక్ మార్కెట్ మొదట నష్టాల్లోకి వెళ్ళినప్పటికీ ప్రస్తుతం స్థిరంగా ఉన్నాయని ఐఎంఎఫ్ నివేదికలు పేర్కొన్నాయి. 
 
ఐఎంఎఫ్ ఇస్తున్న నిధులను పాక్‍‌ అభివృద్ధికి కాకుండా ఉగ్రవాదలను పెంచి పోషించడానికి వినియోగిస్తోందంటూ భారత్ ఇటీవల ఆరోపించింది. ఆపరేషన్‌ సిందూర్‌లో ధ్వంసమైన ఉగ్రవాద స్థావరాలను పునర్నిర్మంచడానికి జైషే మొహ్మద్ చీఫ్ అసూద్ ఆజాద్‌కు పాకిస్థాన్ రూ.14 కోట్లు ఇస్తున్నట్టు పాక్ ప్రభుత్వం ప్రకటించిందని పేర్కొంది. ఇలాంటి విషయాలన్ని ఐఎంఎఫ్ ముందు భారత్ ప్రస్తావించినప్పటికీ పాకిస్థాన్‌కు మాత్రం ఐఎంఎఫ్ నిధులు మంజూరు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: కృతి స‌న‌న్ తో ప్రేమలో మోసపోయాక యుద్ధమే అంటున్న ధనుష్ - అమ‌ర‌కావ్యం (తేరే ఇష్క్ మై)

అఖండ 2 డిసెంబర్ 12న వస్తోందా నిర్మాతలు ఏమన్నారంటే?

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments