Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇరాన్‌ నూతన అధ్యక్షుడిగా ఇబ్రహీం రైసీ ఎన్నిక

Webdunia
సోమవారం, 21 జూన్ 2021 (06:07 IST)
ఇరాన్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికలలో ఇబ్రహిమ్‌ రైసీ గెలుపొందారు. ఆ దేశంలోని అధికార పార్టీకి చెందిన రైసే ఇప్పటి వరకు న్యాయ వ్యవస్థకు అధిపతిగా ఉన్నారు. రైసీకి 61.95శాతం ఓటుల వచ్చాయి. ఈ సారి ఎన్నికలలో 48.8శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించు కున్నారు. ఆగస్టులో రైసీ బాధ్యతలు చేపట్టనున్నారు.

ఎన్నికలను బహిష్కరించిన ఇరాన్‌ కమ్యూనిస్టు పార్టీ
అధ్యక్ష ఎన్నికలను ఇరాన్‌ తుడే పార్టీ (ఇరాన్‌ కమ్యూనిస్టు పార్టీ)బహిష్కరించింది. నిరంకుశ, మత ఛాందసవాద ప్రభుత్వం ఎన్నికలను ఒక ప్రహసనంగా మార్చుతున్నందున ప్రజస్వామ్యవాదులు, దేశ భక్తి యుత శక్తులు ఈ ఎన్నికలను బహిష్కరించాలని తుడే పార్టీ పిలుపునిచ్చింది.

ఇరాన్‌లో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ప్రజావ్యతిరేకమైనది, అవినీతికర మైనది, మతఛాందసవాదంతో కూడినట్టిది. దీనికి ప్రధాన సూత్రధారి ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అలీ ఖమేనీ. దీనిని తొలగించి ప్రజలందరి భాగస్వామ్యంతో కూడిన ప్రభుత్వాన్ని నెలకొల్పేందుకు ఉద్యమాన్ని ఉధృతం చేయాలని తుడే పార్టీ కోరింది. శాంతి, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం, కార్మికుల హక్కుల కోసమే ఈ ఎన్నికలను బహిష్కరించినట్లు పార్టీ తెలిపింది.

ప్రస్తుతం న్యాయవ్యవస్థ అధిపతిగా ఉన్న రైసీ 1988లో వేలాది మంది స్వాతంత్య్ర సమరయోధులను, రాజకీయ ఖైదీలను అమానుషంగా పొట్టనబెట్టుకున్నారు. ఆయన నేర చరితను కప్పిపుచ్చి గొప్ప నాయకుడిగా కీర్తిస్తూ ప్రభుత్వ ప్రచార బాకాలు, మితవాద శక్తులు ప్రచారం చేశాయి.

అయినా ఈ నెల 18న జరిగిన ఎన్నికల పోలింగ్‌లో 42 ఏళ్ల అధ్యక్ష ఎన్నికల్లో ఎన్నడూ లేనంత తక్కువ ఓట్లు (37-47 శాతం మధ్య) పోలయ్యాయి. అణగారిన వర్గాల ఓటర్లు ఈ ఎన్నికలకు చాలావరకు దూరంగా ఉండడం ఓటింగ్‌ ప అదే రోజు అలీ ఖమేనీ జాతి నుద్దేశించి మాట్లాడుతూ ఎన్నికలను ఘనంగా నిర్వహించడంలో కృతకృత్యులం కాలేకపోయామని అంగీకరించారని కమ్యూనిస్టు పేర్కొంది. ఈ మతవాద, మితవాద ప్రభుత్వాన్ని మార్చనిదే ఇరాన్‌ ప్రజలకు నిష్కృతి లేదని తుడే పార్టీ తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments