Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనుషులను తిని అలసిపోయాను.. అరెస్టు చేయండి!

దక్షిణాఫ్రికాలో నరమాంసభక్షకుడు ఒకడు పోలీస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు. మనుషులను తిని.. తిని అలసిపోయానని, తనను అరెస్ట్ చేయాలంటూ పోలీసులను ప్రాధేయపడ్డాడు. పైగా, అతను ఓ మనిషి కాలు, చేతిని పట్టుకుని స్ట

Webdunia
గురువారం, 24 ఆగస్టు 2017 (11:07 IST)
దక్షిణాఫ్రికాలో నరమాంసభక్షకుడు ఒకడు పోలీస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు. మనుషులను తిని.. తిని అలసిపోయానని, తనను అరెస్ట్ చేయాలంటూ పోలీసులను ప్రాధేయపడ్డాడు. పైగా, అతను ఓ మనిషి కాలు, చేతిని పట్టుకుని స్టేషన్‌కు వెళ్లడంతో పోలీసులకు గుండే ఆగినంతపని అయింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
దక్షిణాఫ్రికాలోని అమాంగ్వే ప్రాంతంలో కొంతకాలంగా పలువురు కన్పించకుండా పోతున్నారని ఎంతో మంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు విచారణ చేపట్టగా ఓ చోట కుండలో పోగు చేసిన మానవ అవయవాలు లభ్యమయ్యాయి.
 
దీనిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఇంతలో ఓ వ్యక్తి పోలీసు స్టేషన్‌కు వెళ్లి తనను అరెస్టు చేయాలని ప్రాధేయపడ్డాడు. తనతో పాటు మరో ఇద్దరం కలిసి ఓ మహిళను దారుణంగా చంపి ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికి, అవయవాలు తినేసినట్టు చెప్పాడు. పైగా, తనకి మనుషులను తిని అలసిపోయానంటూ పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోవడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments