Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైతీ దేశాధ్యక్షుడు మోసీ దారుణ హత్య

Webdunia
గురువారం, 8 జులై 2021 (12:03 IST)
కరేబియన్ దేశాల్లో ఒకటైన హైతీ దేశాధ్యక్షుడు జొవెనెల్ మోసీ దారుణ హత్యకుగురయ్యారు. ఆయన నివాసంలోనే ఆయనను దుండగులు దారుణంగా హతమార్చారు. 
 
ఇంట్లోకి చొరబడిన గుర్తు తెలియని దుండగులు ఆయన, ఆయన భార్యపై తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మోసీ మృతి చెందారు. ఆయన భార్య మార్టిన్ మోసీ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. 
 
ఈ హత్యను హైతీ తాత్కాలిక ప్రధాని క్లౌడే జోసెఫ్ తీవ్రంగా ఖండించారు. ఇదొక దుర్మార్గపు, అమానవీయ చర్య అని ఆయన అన్నారు. మరోవైపు అధ్యక్షుడు హత్యకు గురయ్యారనే వార్తతో ఆ దేశ ప్రజలు ఉలిక్కి పడ్డారు. 
 
ఈ హత్యతో దేశంలో హింస చెలరేగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ విభాగం హెచ్చరించింది. దీంతో, అప్రమత్తమైన పోలీసులు, భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని తాత్కాలిక ప్రధాని తెలిపారు. 
 
హత్యపై సమగ్ర దర్యాప్తును జరుపుతున్నామని చెప్పారు. హైతీలో రాజకీయ, ఆర్థిక స్థిరత్వం దారుణంగా దెబ్బతిన్నాయి. దీంతో అక్కడ గ్యాంగ్ వార్‌‌లు కూడా ఎక్కువయ్యాయి. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments