Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైతీ దేశాధ్యక్షుడు మోసీ దారుణ హత్య

Webdunia
గురువారం, 8 జులై 2021 (12:03 IST)
కరేబియన్ దేశాల్లో ఒకటైన హైతీ దేశాధ్యక్షుడు జొవెనెల్ మోసీ దారుణ హత్యకుగురయ్యారు. ఆయన నివాసంలోనే ఆయనను దుండగులు దారుణంగా హతమార్చారు. 
 
ఇంట్లోకి చొరబడిన గుర్తు తెలియని దుండగులు ఆయన, ఆయన భార్యపై తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మోసీ మృతి చెందారు. ఆయన భార్య మార్టిన్ మోసీ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. 
 
ఈ హత్యను హైతీ తాత్కాలిక ప్రధాని క్లౌడే జోసెఫ్ తీవ్రంగా ఖండించారు. ఇదొక దుర్మార్గపు, అమానవీయ చర్య అని ఆయన అన్నారు. మరోవైపు అధ్యక్షుడు హత్యకు గురయ్యారనే వార్తతో ఆ దేశ ప్రజలు ఉలిక్కి పడ్డారు. 
 
ఈ హత్యతో దేశంలో హింస చెలరేగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ విభాగం హెచ్చరించింది. దీంతో, అప్రమత్తమైన పోలీసులు, భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని తాత్కాలిక ప్రధాని తెలిపారు. 
 
హత్యపై సమగ్ర దర్యాప్తును జరుపుతున్నామని చెప్పారు. హైతీలో రాజకీయ, ఆర్థిక స్థిరత్వం దారుణంగా దెబ్బతిన్నాయి. దీంతో అక్కడ గ్యాంగ్ వార్‌‌లు కూడా ఎక్కువయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments