Webdunia - Bharat's app for daily news and videos

Install App

నైజీరియాలో మారణహోమం - 12 మందిని కాల్చిచంపిన దుండగులు

Webdunia
సోమవారం, 5 డిశెంబరు 2022 (10:06 IST)
నైజీరియా దేశంలో మరో మారణహోమం జరిగింది. ఒక మసీదులో చొరబడిన సాయుధ దుండగులు మసీదు ఇమామ్‌తో సహా 12 మందిని తుపాకీతో కాల్చి చంపేశారు. ఆ తర్వాత మరికొందరిని బందీలుగా తమ వెంట తీసుకెళ్లారు. 
 
గత కొంతకాలంగా నైజీరియాలో బందిపోట్లుగా పిలిచే సాయుధ ముఠాలు ప్రజలపై దాడి చేసి హత్య చేయడమో లేక కిడ్నాప్ చేసి పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేయడమో పరిపాటిగా మారిపోయింది. అలాగే, రైతులు పంటలు పండించుకోవాలన్నా ఈ ముఠాలకు ప్రొటెక్షన్ ఫీ పేరుతో కప్పం చెల్లించుకోవాల్సిన నిర్బంధ పరిస్థితి నెలకొంది. 
 
ఈ నేపథ్యంలో తాజాగా సాయుధ దండగులు మరోమారు పెట్రేగిపోయారు. ఏకంగా 12 మందిని కాల్చిచంపి మారణహోమానికి పాల్పడ్డారు. ఈ దారుణం నైజీరియా అధ్యక్షుడు ముహమ్ముదు బుహారీ సొంత రాష్ట్రమైన కట్సినాలో జరిగింది. మైగమ్‌జీ మసీదు వద్ద మోటారు సైకిళ్లపై వచ్చిన దండగులు ఒక్కసారిగా లోపల ప్రార్థనలు చేస్తున్న వారిపై కాల్పులు జరిపారు. 
 
దీంతో మసీదులో ఉన్న వారు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రాణభయంతో పరుగులు చేశారు. ఈ క్రమంలో మసీదు ఇమామ్‌తో సహా 12 మందిని కాల్చిచంపేశారు. ఆ తర్వాత మరికొందరిని కిడ్నాప్ చేశారు. బందిపోట్ల ముఠా శిబిరాలపై నైజీరియా సైన్యం దాడులు చేస్తున్నప్పటికీ ఇలాంటి మారణహోమాలు మాత్రం ఆగడంలేదు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments