Webdunia - Bharat's app for daily news and videos

Install App

నైజీరియాలో మారణహోమం - 12 మందిని కాల్చిచంపిన దుండగులు

Webdunia
సోమవారం, 5 డిశెంబరు 2022 (10:06 IST)
నైజీరియా దేశంలో మరో మారణహోమం జరిగింది. ఒక మసీదులో చొరబడిన సాయుధ దుండగులు మసీదు ఇమామ్‌తో సహా 12 మందిని తుపాకీతో కాల్చి చంపేశారు. ఆ తర్వాత మరికొందరిని బందీలుగా తమ వెంట తీసుకెళ్లారు. 
 
గత కొంతకాలంగా నైజీరియాలో బందిపోట్లుగా పిలిచే సాయుధ ముఠాలు ప్రజలపై దాడి చేసి హత్య చేయడమో లేక కిడ్నాప్ చేసి పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేయడమో పరిపాటిగా మారిపోయింది. అలాగే, రైతులు పంటలు పండించుకోవాలన్నా ఈ ముఠాలకు ప్రొటెక్షన్ ఫీ పేరుతో కప్పం చెల్లించుకోవాల్సిన నిర్బంధ పరిస్థితి నెలకొంది. 
 
ఈ నేపథ్యంలో తాజాగా సాయుధ దండగులు మరోమారు పెట్రేగిపోయారు. ఏకంగా 12 మందిని కాల్చిచంపి మారణహోమానికి పాల్పడ్డారు. ఈ దారుణం నైజీరియా అధ్యక్షుడు ముహమ్ముదు బుహారీ సొంత రాష్ట్రమైన కట్సినాలో జరిగింది. మైగమ్‌జీ మసీదు వద్ద మోటారు సైకిళ్లపై వచ్చిన దండగులు ఒక్కసారిగా లోపల ప్రార్థనలు చేస్తున్న వారిపై కాల్పులు జరిపారు. 
 
దీంతో మసీదులో ఉన్న వారు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రాణభయంతో పరుగులు చేశారు. ఈ క్రమంలో మసీదు ఇమామ్‌తో సహా 12 మందిని కాల్చిచంపేశారు. ఆ తర్వాత మరికొందరిని కిడ్నాప్ చేశారు. బందిపోట్ల ముఠా శిబిరాలపై నైజీరియా సైన్యం దాడులు చేస్తున్నప్పటికీ ఇలాంటి మారణహోమాలు మాత్రం ఆగడంలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments