శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం.. రామేశ్వరం వచ్చేస్తున్న తమిళులు

Webdunia
శుక్రవారం, 25 మార్చి 2022 (14:08 IST)
Sri lanka
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం ముదురుతోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా శ్రీలంకకు ఆహార సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. 1970వ దశకంలో సిరిమావో బండారునాయకే ప్రధానిగా ఉన్న సమయంలో శ్రీలంకలో కరువు ఏర్పడిందని అంటున్నారు. అయితే ప్రస్తుత సంక్షోభం అంతకంటే ఘోరంగా ఉందని కొందరు భావిస్తున్నారు. 
 
దీని ప్రభావంతో పెట్రోల్, డీజిల్ దగ్గర నుంచి నిత్యావసర ధరలకు రెక్కలొచ్చాయి.  దీంతో శ్రీలంకేయులతో పాటు అక్కడున్న తమిళులు నానా తంటాలు పడుతున్నారు. తినడానికి తిండిలేక గత్యంతరం లేని పరిస్థితుల్లో వలసబాట పడుతున్నారు శ్రీలంక తమిళులు. 
 
సముద్రం మార్గం ద్వారా రామేశ్వరం, ధనుస్కోడి ప్రాంతాలకు తరలివస్తున్నారు. శ్రీలంక తమిళుల కోసం ఇక్కడి సర్కార్‌ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. 
 
పునరావాస కేంద్రాన్ని నెలకొల్పి వసతి కల్పిస్తోంది. రామేశ్వరంలో శ్రీలంక తమిళుల పునరావాస కేంద్రానికి వలసదారుల తాకిడి పెరుగుతోంది. శ్రీలంకలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరగడం వల్ల అనేక కుటుంబాలు తమ దేశాన్ని విడిచిపెట్టి అక్రమంగా భారత తీరాలకు చేరుకుంటున్నాయి. 
 
శ్రీలంక పౌరులు బోట్ల ద్వారా భారత్‌కు చేరుకున్నారు. ఇలా అక్రమంగా వస్తున్న వారిని తమిళనాడు మెరైన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 
కాగా, శరణార్థులుగా భారత్‌కు చేరుకునే శ్రీలంక పౌరులను అడ్డుకునేందుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించినట్లు శ్రీలంక నేవీ అధికారులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 9 బంధాలు: సెంటిమెంట్ బాగా పండుతోంది.. ఆట పడిపోతుంది.. క్రేజ్ గోవిందా

Sai Abhyankar : అనిరుధ్‌కి పోటీగా సాయి అభ్యంకర్‌.. డ్యూడ్ హిట్ ఇస్తాడా?

Dhruv Vikram: పీరియాడిక్ నేపథ్యంలో కబడ్డీ ఆట కథాంశంతో బైసన్ చిత్రం

Siddhu : క్యారెక్టర్ కుదిరితేనే షూటింగ్ కి వస్తానని చెప్పా : సిద్ధు జొన్నలగడ్డ

అరి సినిమా రెస్పాన్స్ చాలా హ్యాపీగా ఉంది - డైరెక్టర్ జయశంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

తర్వాతి కథనం