Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీలంక వేదికగా ఆసియా క్రికెట్ కప్ టోర్నీ

Advertiesment
Asia Cup 2022
, శనివారం, 19 మార్చి 2022 (18:38 IST)
గత నాలుగేళ్ళుగా వివిధ కారణాల వల్ల ఆగిపోయిన ఆసియా క్రికెట్ కప్ పోటీలు మళ్లీ ప్రారంభంకానున్నాయి. ఈ పోటీలకు శ్రీలంక ఆతిథ్యమివ్వనుంది. ఆగస్టు 27వ తేదీ నుంచి సెప్టెంబరు 11వ తేదీ వరకు ఈ పోటీలను నిర్వహిస్తారు. ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచ కప్‌కు ముందు ఆసియా కప్‌ను నిర్వహిస్తున్నారు. దీంతో ఈ ఆసియా కప్ టోర్నీ టీ20 ఫార్మెట్‌లో నిర్వహించేలా సన్నాహాలు చేస్తున్నారు. 
 
ఈ టోర్నీలో భారత్, శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్థాన్ జట్లతో పాటు మరో దేశం పాల్గొనాల్సివుంది. కాగా ఇప్పటివరకు మొత్తం 14 సార్లు ఈ టోర్నీని నిర్వహించగా ఏడుసార్లు భారత్ విజేతగా నిలించింది. అలాగే, శ్రీలంక ఐదు సార్లు, పాకిస్థాన్ రెండుసార్లు చాంపియన్‌గా నిలిచింది. 2021 జూన్‌లోనే ఆసియా కప్ టోర్నీని నిర్వహించాలని ప్లాన్ చేసినప్పటికీ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా అది సాధ్యపడలేదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆసియా కప్ ట్వంటీ-20 టోర్నీ: ఆగస్టు 27 నుంచి ఆరంభం