స్నేహితులతో కలిసి పార్టీలో పాల్గొన్న ప్రధాని.. డ్రగ్స్ పరీక్ష

Webdunia
శనివారం, 20 ఆగస్టు 2022 (11:11 IST)
ఫిన్లాండ్ ప్రధాని సనా మారిన్ చిక్కుల్లో పడ్డారు. తన స్నేహితురాళ్లతో కలిసి ఆమె మద్యం పార్టీలో పాల్గొన్నారు. ఇందులో దేశ ప్రధాని అనే విషయాన్ని మరిచిపోయి స్నేహితురాళ్లతో కలిసి డ్యాన్స్ కూడా చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అయింది. అదేసమయంలో ఈ పార్టీలో ప్రధాని సనా మారిన్ డ్రగ్స్ తీసుకున్నారంటూ విపక్ష పార్టీల నేతల ఆరోపించారు. వీరికి గట్టిగా సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్న ప్రధాని స్వయంగా ముందుకు వచ్చిన డ్రగ్స్ పరీక్ష చేయించుకున్నారు. ఈ ఫలితాలు మరో వారం రోజుల్లో రానున్నాయి. 
 
కాగా, ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన ప్రధానిగా గుర్తింపు పొందిన 36 ఏళ్ల సనా మారిన్ శనివారం రాత్రి ఫిన్లాండ్‌కు చెందిన పలువురు ప్రముఖులు, ఆర్టిస్టులతో కలిసి పార్టీ చేసుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో ఆమె స్నేహితులతో కలిసి డ్యాన్స్ చేస్తూ, పాటలు పాడుతూ కనిపించారు. 
 
గతంలో కూడా ఆమె పలు మ్యూజిక్‌ ఈవెంట్లకు హాజరై విమర్శలు ఎదుర్కొన్నారు. తాజా వీడియో బయటకు రాగానే ప్రతిపక్షాలు ఆమెపై ఆరోపణలు గుప్పించాయి. పార్టీలో డ్రగ్స్ తీసుకుని ఉండొచ్చని, అందుకే ఆమె అంతలా పార్టీలో చిందేశారని అనుమానం వ్యక్తం చేశాయి. తనపై వస్తున్న ఆరోపణలను మారిన్ ఖండిచారు. తాను ఆ పార్టీలో డ్రగ్స్ తీసుకోలేదని, ఆల్కహాల్ మాత్రమే తీసుకున్నట్టు ప్రకటించారు. 
 
'ఈ మధ్య నేను డ్రగ్స్ ఉపయోగించిన ప్రాంతాల్లో ఉన్నానని, లేదా నేను నేనే డ్రగ్స్ వాడానని ఆరోపణలు వస్తున్నాయి. వీటిని నేను చాలా తీవ్రమైనవిగా భావిస్తున్నా. డ్రగ్ టెస్టు చేయించుకోవాలని డిమాండ్ చేయడం అన్యాయంగా భావిస్తున్నప్పటికీ, అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు నేను ఈ రోజు డ్రగ్ టెస్ట్ చేయించుకున్నా. దాని ఫలితాలు ఒక వారంలో వస్తాయి' అని సనా పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments