Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రాక్టర్‌ను ఢీకొట్టిన ట్రక్కు.. ఆరుగురు భక్తుల దుర్మరణం

Webdunia
శనివారం, 20 ఆగస్టు 2022 (11:04 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో ఘోరం జరిగింది. కొంతమంది భక్తులతో వెళుతున్న ఓ ట్రాక్టర్‌ను ట్రక్కు ఒకటి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు భక్తులు దుర్మణం పాలయ్యారు. ఈ ఘోరం శుక్రవారం రాత్రి రాజస్థాన్ రాష్ట్రంలోని పాలి జిల్లా సుమేర్‌పూర్ వద్ద జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
పాలికి చెందిన కొందరు భక్తులు ట్రాక్టర్‌లో జైసల్మేర్‌లో రామ్ దేవ్రాకు వెళ్లి తిరిగి వస్తున్నారు. ఈ ట్రాక్టర్ సుమేర్ పూర్ వద్ద వస్తుండగా ఎదురుగా అమిత వేగంగా వచ్చిన ఓ ట్రక్కు ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు యాత్రికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. 
 
సమచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ, ఉపరాష్ట్రపది ధన్‌కర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించి, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments