Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేపాల్‌లో భారీ భూకంపం: 69 మంది మృతి, పలువురికి గాయాలు

Webdunia
శనివారం, 4 నవంబరు 2023 (09:12 IST)
నేపాల్‌లో భారీ భూకంపం ఏర్పడింది. శుక్రవారం అర్ధరాత్రి పశ్చిమ నేపాల్‌లో 5.6-తీవ్రతతో కూడిన భూకంపం సంభవించడంతో దాదాపు 69 మంది మరణించారు. డజన్ల కొద్దీ గాయపడినట్లు అధికారులు తెలిపారు.
 
పశ్చిమ జాజర్‌కోట్ జిల్లాలో శనివారం తెల్లవారుజామున 2:02 గంటలకు ఈ భూకంపం ఏర్పడింది. 18 కి.మీ లోతుతో భూకంపం సంభవించిందని యుఎస్ జియోలాజికల్ సర్వేను ఉటంకిస్తూ జిన్హువా వార్తా సంస్థ నివేదించింది. 
 
భూకంపం కారణంగా రుకుమ్ జిల్లాలో 35 మంది, పొరుగున ఉన్న జాజర్‌కోట్ జిల్లాలో 34 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. ప్రధాన మంత్రి పుష్ప కమల్ దహల్ భూకంపం కారణంగా ప్రాణనష్టం, ఆస్తినష్టం పట్ల విచారం వ్యక్తం చేశారు. 
 
తక్షణమే రెస్క్యూ మరియు రిలీఫ్ ఆపరేషన్‌లకు ఆదేశించారు. కాగా 2015లో ఇదే తరహా భూకంపం ఏర్పడింది. 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల దాదాపు 9,000 మంది మరణించారు. పర్వత దేశంలోని అర మిలియన్లకు పైగా ఇళ్లు ధ్వంసం అయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేణుకాస్వామికి బదులు నిన్ను హత్య చేయాల్సింది ... అత్యాచారం చేస్తాం : నటి రమ్యకు బెదిరింపులు

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments