Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేపాల్‌లో భారీ భూకంపం: 69 మంది మృతి, పలువురికి గాయాలు

Webdunia
శనివారం, 4 నవంబరు 2023 (09:12 IST)
నేపాల్‌లో భారీ భూకంపం ఏర్పడింది. శుక్రవారం అర్ధరాత్రి పశ్చిమ నేపాల్‌లో 5.6-తీవ్రతతో కూడిన భూకంపం సంభవించడంతో దాదాపు 69 మంది మరణించారు. డజన్ల కొద్దీ గాయపడినట్లు అధికారులు తెలిపారు.
 
పశ్చిమ జాజర్‌కోట్ జిల్లాలో శనివారం తెల్లవారుజామున 2:02 గంటలకు ఈ భూకంపం ఏర్పడింది. 18 కి.మీ లోతుతో భూకంపం సంభవించిందని యుఎస్ జియోలాజికల్ సర్వేను ఉటంకిస్తూ జిన్హువా వార్తా సంస్థ నివేదించింది. 
 
భూకంపం కారణంగా రుకుమ్ జిల్లాలో 35 మంది, పొరుగున ఉన్న జాజర్‌కోట్ జిల్లాలో 34 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. ప్రధాన మంత్రి పుష్ప కమల్ దహల్ భూకంపం కారణంగా ప్రాణనష్టం, ఆస్తినష్టం పట్ల విచారం వ్యక్తం చేశారు. 
 
తక్షణమే రెస్క్యూ మరియు రిలీఫ్ ఆపరేషన్‌లకు ఆదేశించారు. కాగా 2015లో ఇదే తరహా భూకంపం ఏర్పడింది. 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల దాదాపు 9,000 మంది మరణించారు. పర్వత దేశంలోని అర మిలియన్లకు పైగా ఇళ్లు ధ్వంసం అయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జపాన్ ప్రభాస్ ఫ్యాన్స్ ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చారు

ఇప్పుడే శ్రీలీలకు అది అర్థమైంది..?

సీనియర్ నటుడు, వ్యాఖ్యాత ఎ.వి. రమణ మూర్తి అమర్నాధ్ యాత్రలో కన్నుమూత

ఎన్.టి.ఆర్. జూనియర్ దేవర తాజా అప్ డేట్ ఇదే!

బిగ్‌బాస్‌ నెక్స్ట్ సీజన్‌లో వేణుస్వామి ఫిక్స్.. చరిత్రలోనే అత్యధిక పారితోషికం..??

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

తర్వాతి కథనం
Show comments