కరోనా టీకా వేయించుకుంటే 25 శాతం డిస్కౌంట్?!

Webdunia
గురువారం, 28 జనవరి 2021 (15:57 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు పలు టీకాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ టీకాల వినియోగం ఇప్పటికే ప్రారంభమైంది. ఈ క్రమంలో వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయన్న ప్రచారం వల్ల చాలా మంది వ్యాక్సిన్ వేయించుకునేందుకు విముఖత చూపుతున్నారు. దీంతో అనేక దేశాలు ఏం చేయాలో తలలు పట్టుకుంటున్నాయి. 
 
ఈ క్రమంలో యూఏఈ ప్రభుత్వం ఇప్పటివరకు దాదాపు 27 లక్షల మందికి వ్యాక్సిన్ వేసింది. ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగంగా సాగేందుకు యూఏఈలోని ప్రైవేటు సంస్థలు ప్రభుత్వానికి సహాయం అందిస్తున్నాయి. తాజాగా దుబాయిలోని బాబ్ అల్ షామ్స్ అనే రిసార్ట్ కొత్త ఆఫర్‌ను తీసుకొచ్చింది. 
 
వ్యాక్సిన్ వేయించుకున్న కస్టమర్లకు తమ హోటల్‌లోని అన్ని బుకింగ్స్‌పై 25 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్టు ప్రకటించింది. ఈ ఆఫర్ ఏప్రిల్ 30 వరకు ఉండనున్నట్టు ప్రకటించింది. దుబాయి హెల్త్ అథారిటీ వ్యాక్సినేషన్ ప్రక్రియను నిరంతరాయంగా కొనసాగిస్తోందని, వారికి సహాయంగా తాము ఈ ఆఫర్‌ను తీసుకొచ్చినట్టు హోటల్ యాజమాన్యం తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments