Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖలో ఏఈ ఆస్తులు చూసి ఏసీబీ అధికారులు షాక్

Webdunia
గురువారం, 28 జనవరి 2021 (15:54 IST)
అతనో  సాధారణ ఎలక్ట్రికల్ ఇంజనీర్... అతను జీతంతో పాటు గీతం కలిపి తాను సర్వీస్ చేసిన కాలంలో సంపాదిస్తే 2, 3 కోట్లు వుండొచ్చు. కానీ అతను సంపాదించిన ఆస్తులు చూసి ఇప్పుడు ఏసీబీ అధికారులులే షాక్ అవుతున్నారు.  కొమ్మది ఎలక్ట్రికల్ ఏ. ఇ నాగేశ్వరరావు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న అభియోగంపై నాగేశ్వరావు ఆస్తులకు సంబంధించి ఏసీబీ అధికారులు గురువారం ఆరు చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.
 
నాగేశ్వరరావుకు విశాఖలో సీతమ్మధార, సీతంపేట, విశాలాక్షి నగర్, ఎంవిపి కాలనీ, రాంబిల్లి ప్రాంతాలతో పాటు తెలంగాణ జిల్లాల్లో భూములు, ఇల్లు, స్థలాలు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అలాగే 3 బ్యాంకు లాకర్లు సీజ్ చేశారు. 1991 సర్వీసులో నాగేశ్వరరావు 94లో ఏసీబీ అధికారులకు చిక్కి సస్పెండ్ అయ్యారు.
 
2012లో తిరిగి విధుల్లో చేరిన నాగేశ్వరరావు లంచం ఇవ్వనిదే మీటర్ కనెక్షన్ కూడా మంజూరు చెయ్యరనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏసీబీ అధికారులు దగ్గర ఉన్న ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో వందల కోట్లు విలువ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ దాడులు ఏసీబీ అడిషనల్ ఎస్పీ షకీలా భాను నేతృత్వంలో విశాఖ డి.ఎస్.పి కె.రంగరాజు, ఏసీబీ అధికారులు పాల్గొని సోదాలు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments