Webdunia - Bharat's app for daily news and videos

Install App

సముద్రం ఒడ్డున నిలబడి ఫోజిచ్చింది.. భారీ అలలు వచ్చి లేపేశాయి..

Webdunia
బుధవారం, 20 మార్చి 2019 (15:38 IST)
మనలో చాలామంది సముద్ర ఒడ్డున నిలుచుని ఫోటోలు తీసుకుంటాం, అలలతో ఆట్లాడుకుంటాము. ఒక్కోసారి అలల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే అదే అలలే మన పాలిట రాక్షస అలలుగా పరిణమిస్తాయి. ఇలాంటి ఘటనే ఒకటి ఇండోనేషియాలోని నుసా లెంబోన్గాన్ అనే ఐలాండ్‌లో ఉన్న డెవిల్స్ టియర్ వద్ద చోటు చేసుకుంది. 
 
ఓ యువతి సముద్రం పక్కన ఉన్న కొండ మీదకి వెళ్లి ఫోటోకు ఫోజిచ్చింది. ఇంతలోనే వెనుకనుండి ఓ పెద్ద రాకాసి అల వచ్చి తనను ఢీకొట్టింది. దీంతో ఆ యువతి ఒక్కసారిగా ఎగిరి పడిపోయింది. డెవిల్స్ టియర్ అనేది ఇండోనేషియాలో బెస్ట్ టూరిస్ట్ స్పాట్. చాలా మంది టూరిస్ట్‌లు నిత్యం అక్కడకు వస్తుంటారు. అక్కడ ఫోటోలకు ఫోజులిస్తూ, ప్రకృతి అందాలను తమ కెమరాల్లో బంధిస్తుంటారు. 
 
భారీ అలలు వస్తున్నప్పుడు మాత్రం పర్యాటకులు కాస్తంత దూరంగా పరిగెడతారు. ఈ అమ్మాయి మాత్రం వెనుకనుండి వచ్చిన భారీ అలను గమనించకపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ అమ్మాయి కాస్త వెనుకకు చూసి ఉంటే ప్రమాదం తప్పేదని నెటిజన్లు కామెంట్‌లు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని : విష్ణు మంచు చమక్కులు

ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీ జ‌న నాయ‌కుడు నుంచి ఫ‌స్ట్ రోర్ రిలీజ్‌

కృష్ణంరాజు డైలాగ్ కత్తందుకో జానకి ని గీతం మార్చిన మిత్ర మండలి

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

Ratnavel: పెద్ది కోసం హ్యుజ్ యాక్షన్ నైట్ సీక్వెన్స్ చేస్తున్న రామ్ చరణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments