Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిజాబ్ దెబ్బకు అట్టుడికిపోతున్న ఇరాన్ - 75 మంది మృతి

Webdunia
మంగళవారం, 27 సెప్టెంబరు 2022 (10:20 IST)
ఇరాన్ దేశాన్ని హిజాబ్ కుదిపేస్తోంది. హిజాబ్‌కు వ్యతిరేకంగా ఆ దేశ మహిళలు కదంతొక్కారు. ఈ సంఖ్య పదుల నుంచి వందలు, వందల నుంచి వేలు, వేల నుంచి లక్షల్లోకి చేరుకుంది. ఫలితంగా హిజాబ్ దెబ్బకు ఇరాన్ అట్టుడికిపోతోంది. ఈ ఆందోశలనపై ఇరాన్ సైనికులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఫలితంగా ఇప్పటివరకు 75 మంది మహిళలు ప్రాణాలు కోల్పోయారు. 
 
హిజాబ్‌ను సరిగా ధరించలేదన్న కారణంతో 22 యేళ్ల యువతిని ఇరాన్ పోలీసుల నైతిక విభాగం అరెస్టు చేసింది. ఆ తర్వాత ఆమె తీవ్ర గాయాలతో మృతి. దేశంలోని 46 నగరాలు, పట్టణాలకు వ్యాపించిన నిరసనలు వ్యాపించాయి. 
 
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో నిన్న వేలాదిమంది ఆందోళనకారులు ‘డెత్ టు ద డిక్టేటర్’ అంటూ నినాదాలు చేశారు. మూడు దశాబ్దాలుగా దేశాన్ని పాలిస్తున్న సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖొమైనీ పాలనకు చరమగీతం పలకాలని నినదించారు. 
 
అమిని మృతి తర్వాత దేశంలోని 46 నగరాలు, పట్టణాలు, గ్రామాలకు నిరసనలు పాకాయి. ఈ నెల 17న ప్రారంభమైన నిరసనల్లో ఇప్పటివరకు 41 మంది ఆందోళనకారులు, పోలీసులు చనిపోయినట్టు ఇరాన్ అధికారిక టీవీ ప్రకటించింది. అమిని మృతికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల్లో విదేశీ కుట్ర ఉందన్న వార్తలను ఇరాన్ ప్రభుత్వం ఖండించింది. 

సంబంధిత వార్తలు

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments