Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉడతకు మరణశిక్ష విధించిన బ్రిటన్ - ఎందుకో తెలుసా?

Webdunia
శుక్రవారం, 31 డిశెంబరు 2021 (07:33 IST)
అనేక మందిని కొరికి గాయపరిచినందుకు ఓ ఉడతకు బ్రిటన్ దేశంలో మరణశిక్షను విధించారు. దీన్ని పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టేందుకు స్థానిక చట్టాలు అనుమతించలేదు. దీంతో విషపు సూది వేసి ఉడతకు మరణశిక్ష విధించారు. ఈ ఘటన బ్రిటన్ దేశంలోని ఫ్లింట్‌షైర్‌లోని బక్లీ పట్టణంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కొరిన్ రెనాల్డ్స్ అనే మహిళ ఓ జంతు, పక్షి ప్రేమికురాలు. ఈమె ఓ ఉడతను పెంచుతూ వచ్చింది. ఈ క్రమంలో క్రిస్మస్‌కు ముందు ఉడతకు ఆహారం పెడుతున్న సమయంలో ఆ ఉడత ఆమె చేతిని కొరికి జారుకుంది. 
 
ఆ తర్వాత రోజు నుంచి చుట్టుపక్కల వారు కూడా ఈ ఉడత కాటుకు గురయ్యారు. అలా ఏకంగా 18 మందిని గాయపరిచింది. క్రిస్మర్ రోజున పట్టణంలో మొత్తం ఈ ఊడత తీరు చర్చనీయాంశమైంది. 
 
ఆ తర్వాత రెనాల్డ్స్ ఓ నిర్ణయానికి వచ్చింది. ఆ ఉడతను అలానే వదిలివేస్తే చాలా ప్రమాదమని తెలిసి దాన్ని బోనులో బంధించి, ద రాయల్ సొసైటీ ఆఫ్ ద ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్ అనే  సంస్థకు అప్పగించింది. 
 
అయితే, ఈ ఉడతను తొలుత అటవీ ప్రాంతంలో వదిలివేద్దామని భావించారు. కానీ, అందుకు స్థానిక చట్టాలు అంగీకరించకపోవడంతో విషపు ఇంక్షన్ వేసి మరణక్షను విధించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments