Webdunia - Bharat's app for daily news and videos

Install App

కువైట్‌లోని భారతీయుల్లో వేగంగా వ్యాపిస్తున్న కరోనా.. కారణమిదే...

Webdunia
ఆదివారం, 5 ఏప్రియల్ 2020 (09:38 IST)
మన దేశ పౌరులు అనేక మంది ఉపాధి కోసం కువైట్‌కు వెళ్లివున్నారు. వీరంతా ఇపుడు కరోనా వైరస్ కారణంగా అక్కడ కష్టాలుపడుతున్నారు. కరోనా దెబ్బకు అంతర్జాతీయ సరిహద్దులు మూసివేశారు. అంతర్జాతీయ రాకపోకలు కూడా నిలిపివేశారు. అదేసమయంలో అరేబియా దేశాల్లో కరోనా వైరస్ కూడా శరవేగంగా వ్యాపిస్తోంది. దీంతో ఆయా దేశాలు కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నాయి. 
 
ముఖ్యంగా, కువైట్‌లో కూడా అనేక మంది భారతీయులు ఈ వైరస్ సోకినట్టు సమాచారం. దీనికి కారణం.. వారు అత్యంత ఇరుకైన గదుల్లో నివసించడంతో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని కువైట్ విదేశీ వ్యవహారాల మంత్రి షేక్ అహ్మద్ నాసర్ అలా సభా చెప్పుకొచ్చారు. ఇదేవిషయాన్ని భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌కు ఫోన్ చేసి తెలిపారు. 
 
పైగా, పరిస్థితి విషమించకముందే వీలైనంత త్వరగా ప్రత్యేక విమానాలను అనుమతించాలని కోరారు. అదేసమయంలో కువైట్‌లోని భారతీయుల యోగక్షేమాలను మంత్రి జైశంకర్‌కు ఆయన వివరించారు. 
 
మహ్బులలో 540 మంది భారతీయులు నివసించే కార్మిక క్యాంపులో వ్యాధి సోకిన ఒకరిని క్వారంటైన్‌ చేసినట్టు చెప్పారు. ఆ తర్వాత మరికొందరిని పరీక్షించగా, వారిలో చాలా మందికి కరోనా పాజిటివ్ రావడంతో వారందరినీ రెండు ప్రత్యేక ఆసుపత్రులకు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments