కరోనా మృతులు లక్ష సంచుల్ని సిద్ధం చేసిన అమెరికా

Webdunia
శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (18:13 IST)
కరోనా దెబ్బకు అమెరికా అతలాకుతలం అవుతోంది. కరోనా బారిన పడి ప్రపంచవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్యలో పావు వంతు అమెరికన్లదే కావడం విషాదకరమైన విషయం. ఇప్పటికే 6000కు పైగా మృతిచెందారు. లక్ష నుంచి రెండున్నర లక్షల మంది అమెరికన్లు కరోనాకు బలవుతారని అమెరికా వైద్య వర్గాలు అంచనా వేస్తున్నట్లు సమాచారం. ఆ మృతదేహాలను తరలించేందుకు వీలుగా ముందస్తుగా లక్ష సంచులు కావాలని అమెరికా విపత్తు స్పందన సంస్థ 'ఫెమా' ఆ దేశ సైన్యానికి సూచించడం గమనార్హం. ఇప్పుడు ఈ వార్త ఆదేశ ప్రజలను వణికిపోయేలా చేస్తోంది.

అంతేగాకుండా.. కరోనాతో ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారాలన్నీ స్తంభించాయి. ముఖ్యంగా అమెరికా కంపెనీలు ముందు జాగ్రత్తతో నష్టాల బారి నుంచి తప్పించుకునేందుకు ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయి. నష్టాలను పూడ్చుకునేందుకు పలు కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తుండటం, హెచ్‌1బీ వీసా కల్గిన ఉద్యోగులనే ముందుగా తొలగిస్తామని ప్రకటించడంతో భారతీయులు ఆందోళన చెందుతున్నారు.

హెచ్‌-1బీ వీసాతో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయులకు కరోనా వైరస్ శాపంగా మారింది. దీంతో కరోనా దెబ్బకు అమెరికాలోవున్న భారతీయులు ఆందోళన పడుతున్నారు. ఏటా హెచ్‌-1బీ పొందుతున్న వారిలో 67 నుంచి 72 శాతం భారతీయులే ఉన్నారు. ఫలితంగా అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయులకు గడ్డుకాలం ఏర్పడింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

IMAXలో స్టార్ట్ అవతార్ హంగామా - భారీగా అడ్వాన్స్ బుకింగ్స్

భూత శుద్ధి వివాహ బంధంతో ఒక్కటైన సమంత - రాజ్ నిడిమోరు

Kandula Durgesh: ఏపీలో కొత్త ఫిల్మ్ టూరిజం పాలసీ, త్వరలో నంది అవార్లులు : కందుల దుర్గేష్

Ram Achanta : అఖండ 2 నిర్మించడానికి గట్టి పోటీనే ఎదుర్కొన్నాం : రామ్, గోపీచంద్ ఆచంట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

తర్వాతి కథనం
Show comments