Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా మృతులు లక్ష సంచుల్ని సిద్ధం చేసిన అమెరికా

Webdunia
శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (18:13 IST)
కరోనా దెబ్బకు అమెరికా అతలాకుతలం అవుతోంది. కరోనా బారిన పడి ప్రపంచవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్యలో పావు వంతు అమెరికన్లదే కావడం విషాదకరమైన విషయం. ఇప్పటికే 6000కు పైగా మృతిచెందారు. లక్ష నుంచి రెండున్నర లక్షల మంది అమెరికన్లు కరోనాకు బలవుతారని అమెరికా వైద్య వర్గాలు అంచనా వేస్తున్నట్లు సమాచారం. ఆ మృతదేహాలను తరలించేందుకు వీలుగా ముందస్తుగా లక్ష సంచులు కావాలని అమెరికా విపత్తు స్పందన సంస్థ 'ఫెమా' ఆ దేశ సైన్యానికి సూచించడం గమనార్హం. ఇప్పుడు ఈ వార్త ఆదేశ ప్రజలను వణికిపోయేలా చేస్తోంది.

అంతేగాకుండా.. కరోనాతో ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారాలన్నీ స్తంభించాయి. ముఖ్యంగా అమెరికా కంపెనీలు ముందు జాగ్రత్తతో నష్టాల బారి నుంచి తప్పించుకునేందుకు ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయి. నష్టాలను పూడ్చుకునేందుకు పలు కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తుండటం, హెచ్‌1బీ వీసా కల్గిన ఉద్యోగులనే ముందుగా తొలగిస్తామని ప్రకటించడంతో భారతీయులు ఆందోళన చెందుతున్నారు.

హెచ్‌-1బీ వీసాతో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయులకు కరోనా వైరస్ శాపంగా మారింది. దీంతో కరోనా దెబ్బకు అమెరికాలోవున్న భారతీయులు ఆందోళన పడుతున్నారు. ఏటా హెచ్‌-1బీ పొందుతున్న వారిలో 67 నుంచి 72 శాతం భారతీయులే ఉన్నారు. ఫలితంగా అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయులకు గడ్డుకాలం ఏర్పడింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments