కరోనా దెబ్బకు విలవిల్లాడుతున్న చైనా.. వేల సంఖ్యలో మృతులు

Webdunia
శుక్రవారం, 7 ఫిబ్రవరి 2020 (11:18 IST)
చైనాలో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఈ వైరస్ బారినపడి చనిపోతున్నవారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఇప్పటివరకు 24 వేల మందికిపైగా రోగులు చనిపోయినట్టు సమాచారం. అలాగే, దాదాపు రెండు లక్షల మంది వరకు ఈ వైరస్ బారినపడినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
కరోనా వైరస్‌కు వ్యూహాన్ నగరం కేంద్రంగా ఉన్న విషయం తెల్సిందే. నిత్యం అత్యంత రద్దీగా ఉండే చైనాలోని ప్రధాన నగరాల రహదారులన్నీ కర్ఫ్యూను తలపిస్తున్నాయి. ప్రజలెవ్వరూ తమ ఇళ్ల నుంచి బయటకు కూడా రావడం లేదు. వైరస్ కారణంగా 564 మంది చనిపోయారని చైనా అధికారికంగా ప్రకటించింది. 
 
కానీ, చైనాలో అతి పెద్ద ఆన్‌లైన్ న్యూస్ వెబ్‌సైట్ 'టెన్సెంట్' మాత్రం ఓ భయంకర నిజాన్ని వెల్లడించింది. చైనాలో కరోనా వైరస్ 1,54,023 మందికి సోకిందని... వీరిలో 24,589 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. దీంతో, చైనాలో తీవ్ర కలకలం రేగింది. ఆ తర్వాత ఆ వెబ్‌సైట్ తన గణాంకాలను మార్చింది. 14,4456 మంది వైరస్ బారిన పడ్డారని, వీరిలో 304 మంది చనిపోయారని తెలిపింది.
 
టెన్సెంట్ తన గణాంకాలను మార్చినా ప్రజల్లో ఆందోళన తగ్గలేదు. టెన్సెంట్ కచ్చితమైన వివరాలనే వెల్లడించిందని... ప్రభుత్వ హెచ్చరికలతో గణాంకాలను మార్చిందని పలువురు ఆరోపిస్తున్నారు. మరోవైపు, చైనాలో వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. వూహాన్‌‌లోనే లక్ష నుంచి 3.5 లక్షల వరకు దీని బారిన పడ్డారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుల సంఖ్య కూడా వేలల్లోనే ఉంటుందని భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments