Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెంటిలేటర్‌లో మంటలు.. కరోనా పేషెంట్ల మృతి

Webdunia
మంగళవారం, 12 మే 2020 (15:16 IST)
ఓవర్ లోడ్ కారణంగా వెంటిలేటర్‌లో మంటలు ఏర్పడిన కారణంగా ఆస్పత్రిలో కరోనా రోగులు మరణించారు. రష్యాలో ఈ ఘోరం జరిగింది. ఓవర్‌లోడ్ వల్ల వెంటిలేటర్ లో మంటలు వచ్చాయని తెలిసింది. సెంట్‌ పీటర్స్‌బర్గ్‌లో కరోనా రోగుల కోసం నిర్వహిస్తున్న ఆస్పత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది. అధికారులు ప్రమాదం జరిగిందని ధ్రువీకరించారు. మృతుల సంఖ్య మాత్రం వెల్లడించలేదు. ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్టు అనధికారిక వార్తల ద్వారా తెలిసింది. 
 
150 మంది రోగులను మంటల నుంచి సురక్షితంగా తరలించారు. గత శనివారం మాస్కోలోని ఓ హాస్పిటల్‌లో అగ్నిప్రమాదం సంభించినప్పుడు అక్కడ కరోనాకు చికత్స పొందుతున్న రోగుల్లో ఒకరు మరణించారు. రష్యాలో కరోనా కేసులు సోమవారం నాటికి 2 లక్షల 21 వేలకు పెరిగాయి.
 
ఇక రష్యాలో కరోనా కొత్త కేసులు బాగా పెరుగుతున్నాయి. రష్యాలో సోమవారం 94 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 2009గా ఉంది. రష్యాలో మరణాలు తక్కువగానే నమోదవుతున్నాయి. ప్రస్తుతం రష్యాలో 1,86,615 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. వీరిలో 2,300 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments