Webdunia - Bharat's app for daily news and videos

Install App

మానవుడి మెదడులో న్యూరాలింక్ చిప్.. ఆశాజనక ఫలితాలు : ఎలాన్ మస్క్ వెల్లడి

ఠాగూర్
శుక్రవారం, 9 ఫిబ్రవరి 2024 (09:54 IST)
ఓ రోగి మెదడులో ఒక న్యూరాలింక్ చిప్‌ను అమర్చినట్టు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రకటించారు. ఈ చిప్ నుచి ఆశాజనక ఫలితాలు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. మనిషి మెదడు, కంప్యూటర్‌ల మధ్య కన్యూనికేషన్ వ్యవస్థను ఏర్పరచడమే ఈ ప్రయోగ లక్ష్యమని ఆయన తెలిపారు. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సహ వ్యవస్థాపకుడిగా గత 2016లో నెలకొల్పిన సంస్థ న్యూరోటెక్నాలజీ కంపెనీ ఈ న్యూరాలింక్. ఇపుడు కీలకమైన ప్రయోగాన్ని చేపట్టింది. మొట్టమొదటిసారిగా ఒక పేషెంట్ మెదడులో చిప్‌ను అమర్చినట్టు పేర్కొంది. ఈ ప్రయోగం నుంచి ఆశాజనక ఫలితాలు వస్తున్నాయని ఎలాన్ మస్క్ స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
 
"నిన్న మొదటిసారి మనిషి మెదడులో న్యూరాలింక్‌ను అమర్చారు. పేషెంట్ కోలుకుంటున్నారు. ప్రారంభ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. నాడీ వ్యవస్థకు చెందిన కణాలను ఖచ్చితంగా గుర్తించడం తెలుస్తుంది అని ఎలాన్ మస్క్ ప్రకటించారు. మనిషి సామర్థ్యాలను ఉత్తేజం చేయడం, పార్కిన్సన్స్ వంటి నాడీ వ్యవస్థ వ్యాధులకు చికిత్స ప్రధాన లక్ష్యాలుగా ఈ ప్రయోగం కొనసాగుతుంది. మనుషులు, కృత్రిమ మేథస్సు మధ్య సహజీవన సంబంధాన్ని సాధించడం కూడా ఒక ఆశయంగా ఉందని గతంలో న్యూరాలింక్ కంపెనీ పేర్కొంది. మనిషి మెదడులో చిప్‌ను అమర్చేందుకు అమెరికా నియంత్రణ సంస్థ నుంచి గత యేడాది అనుమతి లభించడంతో ఈ ప్రయోగం చేపట్టారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

అసభ్యతలేని నిజాయితీ కంటెంట్‌తో తీసిన సినిమా నిలవే : హీరో సౌమిత్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం