Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సార్స్' మరణ మృదంగాన్ని దాటేసిన కరోనా

Webdunia
సోమవారం, 10 ఫిబ్రవరి 2020 (11:23 IST)
పుష్కరకాలం క్రితం ప్రపంచాన్ని సార్స్ వైరస్ షేక్‌కు గురిచేసింది. ఈ సార్స్ వైరస్ దెబ్బకు దాదాపు 700 మంది వరకు చనిపోయారు. ఒక వైరస్ సోకి చనిపోవడం ఇదే హైలెట్‌గా నిలిచింది. కానీ, ఇపుడు ఈ సంఖ్యను కరోనా వైరస్ మృతుల సంఖ్య అధికమించింది. 
 
గత 2002-03 సంవత్సరంలో సార్స్ వైరస్ ప్రపంచాన్ని వణికించింది. దీనిదెబ్బకు వందలాది మంది మృత్యువాతపడ్డారు. దాదాపు 18 సంవత్సరాల క్రితం వచ్చిన సార్స్ 774 మందిని బలితీసుకోగా (అధికారిక లెక్కలు), ఇప్పుడు కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 900 దాటింది. కరోనా మృతులు వేల సంఖ్యలోనే ఉన్నారన్న అనుమానాలు ఉన్నా, చైనా ప్రభుత్వం చెబుతున్న గణాంకాలు మాత్రం ఇవే.
 
ఇపుడు కరోనా ఎలాగైతే చైనాలో వెలుగులోకి వచ్చిందో, నాడు సార్స్ కూడా చైనాలోనే తొలిసారి బయటకు వచ్చింది. ఈ రెండు వైరస్‌లూ ఒకే క్రిమి కుటుంబానికి చెందినవి కావడం గమనార్హం. ఈ రెండింటినీ జీవాయుధాలుగా చైనాయే స్వయంగా అభివృద్ధి చేసిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.
 
ఇక, ప్రస్తుతం అధికారిక లెక్కల ప్రకారం, చైనాలో 40 వేల మంది వరకూ కరోనా సోకి బాధపడుతున్నారు. అందులో 6,188 మంది పరిస్థితి విషమంగా ఉంది. కొత్తగా 3 వేల మంది వరకూ అనుమానితులు ఆసుపత్రుల్లో చేరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్-9‌లో కన్నడ నటి.. ఆమె ఎవరు?

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments