Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెచ్చగొడుతున్న చైనా.. అరుణాచల్ ప్రదేశ్‌లో 11 ప్రాంతాల పేర్లు

Webdunia
మంగళవారం, 4 ఏప్రియల్ 2023 (14:40 IST)
డ్రాగన్ కంట్రీ చైనా నిత్యం భారత్‌పై బుసలు కొడుతుంది. గతంలో పలుమార్లు కవ్వింపులకు పాల్పడిన చైనా ఇపుడు మరోమారు తన వక్రబుద్ధిని చూపింది. భారత్‌లో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్‌లోని అనేక ప్రాంతాలను ఆక్రమించుకున్న చైనా... ఇపుడు ఆ ప్రాంతాల పేర్లను మారుస్తుంది. తాజాగా 11 ప్రాంతాల పేర్లను మార్చింది. చైనీస్, టిబెటిన్, షిన్యన్ అక్షరాలతో వీటి పేర్లను విడుదల చేసింది. ఇది మూడో విడత చర్యలో భాగంగా ఈ ప్రాంతాలను ఎంచుకుంది. 
 
చైనా మంత్రివర్గం జారీ చేసిన భౌగోళిక పేర్లపై నిబంధనలను అనుసరించి చైనా పౌర వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజాగా చైనీస్, టిబెటన్, షిన్యిన్ అక్షరాలతో ప్రామాణిక పేర్లను విడుదల చేసింది. ఈ జాబితాలో రెండు భూభాగాలను, ఐదు పర్వత శిఖరాలను, రెండు నదులతో పాటు సబార్డినేట్ అడ్మినిస్ట్రేటివ్ జిల్లాలు ఉన్నాయి. ఈ విషయాన్ని చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. 
 
2017లో తొలి విడతలో ఆరు ప్రాంతాలకు, 2021లో రెండో విడతలో 15 ప్రాంతాలకు చైనా పేర్లు పెట్టింది. ఇపుడు మూడో విడతగా 11 ప్రాంతాలకు చైనా పేర్లు పెట్టబోతున్నట్టు రాసుకొచ్చింది. పైగా, ఈ పేర్ల ప్రకటన చట్టబద్ధమైన చర్య అని, అది చైనా సార్వభౌమ హక్కు అని చైనా నిపుణులను ఉటంకిస్తూ పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments