Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్నారులకు సెల్‌ఫోన్లు బంద్.. చైనా కఠిన ఆంక్షలు

Webdunia
గురువారం, 3 ఆగస్టు 2023 (12:58 IST)
ఆధునిక ప్రపంచంలో సెల్‌ఫోన్లు అనివార్యంగా మారాయి. చిన్నపిల్లల నుంచి అందరూ స్మార్ట్‌ ఫోన్లు వాడుతున్నారు. పిల్లలు ఎక్కువసేపు సెల్‌ఫోన్‌లు వాడుతున్న కారణంగా వారిలో నిద్రలేమి గురవుతున్నారు. అందువల్ల పిల్లలకు సెల్‌ఫోన్లు ఇవ్వవద్దని వైద్యులు సూచించారు. 
 
ఈ స్థితిలో చిన్నారులు సెల్‌ఫోన్లు వాడకుండా చైనా కఠిన ఆంక్షలు విధించింది. ఇందుకు సంబంధించి చైనా సెల్‌ఫోన్ నియంత్రణ మండలి నిబంధనలను రూపొందించింది. 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు రోజుకు గరిష్టంగా 2 గంటలు మాత్రమే సెల్‌ఫోన్‌లను ఉపయోగించడానికి అనుమతించాలి. 
 
8 ఏళ్లలోపు పిల్లలకు రోజుకు 40 నిమిషాలు, 8 నుంచి 16 ఏళ్లలోపు పిల్లలకు ఒక గంట, 16 నుంచి 17 ఏళ్లలోపు పిల్లలకు 2 గంటల సెల్‌ఫోన్‌ వినియోగించేందుకు అనుమతిస్తారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య 18 ఏళ్లలోపు వారికి ఎలాంటి స్మార్ట్‌ఫోన్ సేవలు అందించకూడదు. 
 
18 ఏళ్లలోపు వారు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య మొబైల్ పరికరాల్లో ఇంటర్నెట్ వినియోగించకుండా చర్యలు తీసుకోవాలని సైబర్ బేస్ పేర్కొంది. పిల్లల వయస్సును ధృవీకరించే పరికరాన్ని కూడా స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధానం చేయాలని ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments