చిన్నారులకు సెల్‌ఫోన్లు బంద్.. చైనా కఠిన ఆంక్షలు

Webdunia
గురువారం, 3 ఆగస్టు 2023 (12:58 IST)
ఆధునిక ప్రపంచంలో సెల్‌ఫోన్లు అనివార్యంగా మారాయి. చిన్నపిల్లల నుంచి అందరూ స్మార్ట్‌ ఫోన్లు వాడుతున్నారు. పిల్లలు ఎక్కువసేపు సెల్‌ఫోన్‌లు వాడుతున్న కారణంగా వారిలో నిద్రలేమి గురవుతున్నారు. అందువల్ల పిల్లలకు సెల్‌ఫోన్లు ఇవ్వవద్దని వైద్యులు సూచించారు. 
 
ఈ స్థితిలో చిన్నారులు సెల్‌ఫోన్లు వాడకుండా చైనా కఠిన ఆంక్షలు విధించింది. ఇందుకు సంబంధించి చైనా సెల్‌ఫోన్ నియంత్రణ మండలి నిబంధనలను రూపొందించింది. 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు రోజుకు గరిష్టంగా 2 గంటలు మాత్రమే సెల్‌ఫోన్‌లను ఉపయోగించడానికి అనుమతించాలి. 
 
8 ఏళ్లలోపు పిల్లలకు రోజుకు 40 నిమిషాలు, 8 నుంచి 16 ఏళ్లలోపు పిల్లలకు ఒక గంట, 16 నుంచి 17 ఏళ్లలోపు పిల్లలకు 2 గంటల సెల్‌ఫోన్‌ వినియోగించేందుకు అనుమతిస్తారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య 18 ఏళ్లలోపు వారికి ఎలాంటి స్మార్ట్‌ఫోన్ సేవలు అందించకూడదు. 
 
18 ఏళ్లలోపు వారు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య మొబైల్ పరికరాల్లో ఇంటర్నెట్ వినియోగించకుండా చర్యలు తీసుకోవాలని సైబర్ బేస్ పేర్కొంది. పిల్లల వయస్సును ధృవీకరించే పరికరాన్ని కూడా స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధానం చేయాలని ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి

ఫ్యాన్స్‌కు మెగా ఫీస్ట్ - ఎంఎస్‌జీ నుంచి 'శశిరేఖ' లిరికల్ సాంగ్ రిలీజ్ (Video)

థర్డ్ పార్టీల వల్లే సినిమాల విడుదలకు బ్రేక్ - యధావిధిగా ది రాజాసాబ్‌ రిలీజ్ : నిర్మాత విశ్వప్రసాద్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments