'కరోనా' గురించి తొలిసారి హెచ్చరించిన వైద్యుడు ఆ వైరస్‌కే మృతి

Webdunia
శుక్రవారం, 7 ఫిబ్రవరి 2020 (11:27 IST)
Li Wenliang
చైనాలో పరిస్థితి అత్యంత దయనీంగా ఉంది. కరోనా వైరస్ ధాటికి అనేకమంది మృత్యువాతపడుతున్నారు. ప్రతిరోజూ అనేక వందల మందికి ఈ వైరస్ సోకుతోంది. దీంతో పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. మరోవైపు, కరోనా వైరస్ గురించి ఈ ప్రపంచానికి ముందే హెచ్చరించిన వైద్యుడు కూడా చివరకు ఆ వైరస్ బారినపడి మృత్యువాతపడ్డారు. ఈ వార్త విన్న అనేక మంది తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. ఆ వైద్యుడు పేరు లీ వెన్‌లియాంగ్. వయసు 34 యేళ్లు. ఈయన కరోనా వైరస్ బారినపడి శుక్రవారం తెల్లవారుజామున ప్రాణాలు విడిచాడు. ఈ విషయాన్ని ఆయన పనిచేసిన వుహాన్ సెంట్రల్ ఆసుపత్రి అధికారింగా వెల్లడించింది. 
 
సీఫుడ్ మార్కెట్‌కు చెందిన ఏడుగురు వ్యక్తులు ఆమధ్య అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. వారిని పరీక్షించిన డాక్టర్ లీ వారిలో కరోనా వైరస్ లక్షణాలను గుర్తించారు. ఈ వైరస్ తీవ్ర ప్రమాదకరమని గుర్తించిన లీ.. ఇది మరింత విస్తరించి ప్రాణాలు బలిగొనే అవకాశం ఉందని ప్రపంచాన్ని హెచ్చరిస్తూ గతేడాది డిసెంబరు 30న సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ముఖ్యంగా, 'సార్స్' వంటి ప్రమాదకర వైరస్ వుహాన్‌ నగరంలో విస్తరిస్తోందని హెచ్చరించారు. 
 
ఈ పోస్టును తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం అతడిని అనేక విధాలుగా ఇబ్బందులకు గురిచేసింది. వైరస్ గురించి అపోహలు ప్రచారం చేస్తున్నందుకు పోలీసులు అతడిని నిర్బంధంలోకి తీసుకున్నారు. కానీ, ప్రస్తుతంలో దేశంలో నెలకొన్న పరిస్థితిని చూసి చైనా పాలకులు తాము చేసిన తప్పును తెలుసుకున్నారు. 
 
ఇంతలోనే ఆ వైద్యుడు కరోనా వైరస్ బారినపడ్డారు. గత నెల 12వ తేదీ నుంచి చికిత్స పొందుతూ వచ్చిన లీ గురువారం అర్థరాత్రి దాటాక 2:58 గంటలకు కన్నుమూశసినట్టు వైద్యులు తెలిపారు. ఆయనను రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని వైద్యులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments