Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో అలా జరుగుతుంటే.. నిమ్మకు నీరెత్తినట్లు వుంటే ఎలా?

Webdunia
గురువారం, 4 జూన్ 2020 (11:18 IST)
Budha
పాకిస్థాన్ ఆగడాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఇప్పటికే పలుమార్లు నియంత్రణ రేఖ వద్ద కాల్పుల ఉల్లంఘనకు పాల్పడిన పాకిస్థాన్.. తాజాగా పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఓవరాక్షన్ చేస్తోంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో దాదాపుగా 800 ఏళ్లనాటి బౌద్ధ కట్టడాలు, క్షేత్రాలు ఉన్నాయి. ఈ భౌద్ధ క్షేత్రాలను పాకిస్థాన్ నిర్లక్ష్యం చేసింది. కొంతమంది పాక్ ఉగ్రవాదులు ఈ క్షేత్రాలను ధ్వంసం చేస్తుండగా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. 
 
చారిత్రాత్మకమైన భౌద్ద కట్టడాలపై ధ్వంసం చేయడంపై భారత్ ఫైర్ అవుతోంది. పీవోకేలో ఉగ్రవాదులు ఇలాంటి దాడులకు పాల్పడుతుంటే పాక్ చూస్తూ కూర్చోవడం ఏమిటని భారత అధికారులు మండిపడుతున్నారు. పాక్ ఆర్మీ అధికారుల అండదండలతోనే ఉగ్రవాదులు ఇలాంటి దారుణాలకు ఒడిగడుతున్నారని భారత్ ఆరోపించింది.
 
ప్రాచీన, పురాతనమైన చిహ్నాలను ధ్వంసం చేయడం అనాగరికమైన చర్య అని భారత విదేశాంగ శాఖ ఆరోపిస్తోంది. వెంటనే కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. తమ దేశానికీ చెందిన పురావస్తు శాఖాధికారులను అనుమతించాలని, వారిని పునరుద్దరించేలా చూడాలని పాకిస్థాన్‌ను భారత్ విజ్ఞప్తి చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

ఫ్యామిలీ విందులో పవన్ కళ్యాణ్ పాట పాడిన విజయ్ దేవరకొండ

హ్రుతిక్ రోషన్ ఎంత పనిచేశాడు - నీల్ సినిమా అప్ డేట్ బ్రేక్ పడింది

Nayanthara: మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి చిత్రంలో నయనతార ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

తర్వాతి కథనం
Show comments