18 నెలల వ్యవధిలో 42 కుక్కలపై అత్యాచారం.. శిక్ష ఎప్పుడంటే?

Webdunia
గురువారం, 28 సెప్టెంబరు 2023 (14:46 IST)
బ్రిటన్‌కు చెందిన జంతు శాస్త్రవేత్త ఆడమ్ బ్రిటన్ 18 నెలల వ్యవధిలో 42 కుక్కలపై అత్యాచారం చేశాడని.. మూగ జీవాలను హింసకు గురిచేశాడనే షాకింగ్ ఘటన సంచలనానికి దారితీసింది. బీబీసీ, నేషనల్ జియోగ్రాఫిక్‌లతో కలిసి పనిచేసిన జంతుశాస్త్రవేత్త ఆడమ్ బ్రిటన్.. డజన్ల కొద్దీ కుక్కలను చనిపోయే వరకు హింసించినట్టు ఆస్ట్రేలియా కోర్టుకు వెల్లడించాడు. అతడి క్రూరత్వానికి సంబంధించిన ఆధారాలన్నీ కెమెరాలో ఉన్నాయి. 
 
ఆన్‌లైన్‌లో చిన్నారుల అశ్లీల వీడియోలు సహా 60 ఆరోపణలలో తన నేరాలను అంగీకరించిన దోషికి ఇంకా శిక్ష ఖరారు కాలేదు. కేసు విచారణ సందర్భంగా హాలులో ఉన్నవారిని బయటకు వెళ్లిపోవాలని నార్తర్న్ టెరిటరీ సుప్రీం కోర్టు న్యాయమూర్తి సూచించారు. 
 
ఆ వివరాలు తెలిస్తే షాక్‌లోకి వెళ్లిపోయే అవకాశం ఉన్నందున కోర్టు గది నుంచి ప్రజలను బయటకు వెళ్లమని హెచ్చరించారని స్థానిక మీడియా పేర్కొంది. కుక్కలపై అత్యాచారం చేస్తున్న వీడియో బయటపడటంతో నార్తర్న్ టెరిటరీ పోలీసులు 2022లో అతడ్ని అరెస్టు చేశారు. దోషిగా నిర్ధారణ కావడంతో అతడికి డిసెంబర్‌లో శిక్ష ఖరారు కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

Richard Rishi: ద్రౌప‌ది 2 నుంచి నెల‌రాజె... మెలోడీ సాంగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments