గణేష్ నిమజ్జనం వేడుకలో డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో వ్యక్తి మృతి

Webdunia
గురువారం, 28 సెప్టెంబరు 2023 (14:41 IST)
ఇటీవలి కాలంలో తరచూ ఎక్కడో ఒకచోట అకస్మాత్తుగా గుండెపోటుతో మరణిస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి మండలం పాతకారాయిగూడెంలో గుండెపోటుతో వ్యక్తి కుప్పకూలి మరణించాడు. గురువారం నాడు గణేష్ నిమజ్జనం కార్యక్రమంలో దూదిపాళ్ల సత్యనారాయణ అనే వ్యక్తి ఉత్సాహంగా పాల్గొన్నాడు. తప్పెట్ల మోతెక్కిపోతుండగా వారి ముందర నాట్యం చేయడం ప్రారంభించాడు. ఇలా చేస్తూనే అకస్మాత్తుగా కిందపడిపోయాడు. అతడి పరిస్థితిని గమనించిన స్థానికులు వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. ఐతే మార్గమధ్యంలో అతడు ప్రాణాలు విడిచాడు.
 
గుండెను గుల్లచేసే చెడు కొలెస్ట్రాల్ వదిలించుకునేదెలా?
గుండెను గుల్లచేసే వాటిలో చెడు కొలెస్ట్రాల్ ఒకటి. అలాగే అధిక రక్తపోటు, సరైన వ్యాయామం, క్రమబద్దమైన ఆహారం తీసుకోకకపోవడం కూడా గుండె సమస్యలకు కారణమవుతాయి. గుండె అనారోగ్యానికి కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్ పెరిగితే దానిని ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాము. చెడు కొలెస్ట్రాల్‌ను పెంచే ఫాస్ట్ ఫుడ్స్, ఇతర మాంసాహారాన్ని తినడం మానేయాలి.
 
రోజూ ఆపిల్, సిట్రస్ పండ్లను తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ కూడా తొలగిపోతుంది. పెరుగు తీసుకోవాలి, ఐతే పెరుగును తక్కువ మోతాదులో తినాలి. మొలకలు రక్తంలో కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి కాబట్టి వాటిని తినడం ప్రారంభించాలి. క్రమం తప్పకుండా వ్యాయామం లేదా యోగా చేయాలి, సైక్లింగ్ లేదా నడక కూడా చేయవచ్చు.
 
కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో వెల్లుల్లి కూడా ఉపయోగపడుతుంది. ఏదైనా పండు, కూరగాయలు మొదలైన వాటిలో రాక్ సాల్ట్ మిక్స్ చేసి తినాలి. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే మెంతి నీరు కూడా తీసుకోవచ్చు. ఉదయం ఉసిరికాయ లేదా కలబంద రసం త్రాగవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కార్తి చిత్రం వా వాత్తియార్‌ రిలీజ్‌కు చిక్కులు - మద్రాస్ హైకోర్టు బ్రేక్

సెట్‌లోనే నటిస్తూనే చనిపోవాలన్నదే కోరిక - జిమ్‌లో దుస్తులపై ట్రోల్స్ చేశారు : నటి ప్రగతి

Riya Singha: జెట్లీ నుంచి మిస్ యూనివర్స్ రియా సింఘా ఫస్ట్ లుక్ రిలీజ్

జై బాలయ్య అంటూ ప్రేక్షకుల ముందుకు రానున్న సఃకుటుంబానాం

Jin: వైవిధ్యభరితమైన కథతో సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ జిన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఫ్యాషన్‌ను ప్రముఖమైనదిగా నడిపించే బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

పది లక్షల మంది పిల్లల్లో ప్రకటనల అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యం

తర్వాతి కథనం
Show comments