Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్‌లో బాంబు పేలుడు.. ఏడుగురు చిన్నారులు మృతి

Webdunia
మంగళవారం, 27 అక్టోబరు 2020 (13:43 IST)
పాకిస్థాన్‌లోని పెషావర్ నగరం భారీ బాంబు పేలుడుతో దద్దరిల్లింది.  వాయువ్య పాకిస్తాన్ నగరమైన పెషావర్ శివార్లలోని ఇస్లామిక్ సెమినరీ సమీపంలో మంగళవారం జరిగిన పేలుడులో చిన్నారులతో సహా ఏడుగురు మరణించారు. 

70 మందికి పైగా గాయపడ్డారు.  క్షతగాత్రులను లేడీ రీడింగ్ ఆసుపత్రికి తరలించారు.  నగర శివారులో ఉన్న ఇస్లామిక్‌ సెమినరీని లక్ష్యంగా చేసుకొని దుండగులు ఈ దారుణానికి పాల్పడ్డట్లు పోలీసులు వెల్లడించారు.

తరగతులు జరుగుతుండగా.. గుర్తు తెలియని వ్యక్తి ఓ బ్యాగుతో సెమినరీలోకి ప్రవేశించినట్లు పోలీసులు వెల్లడించారు. పేలుడులో దాదాపు ఐదు కిలోల ఐఈడీని ఉపయోగించి ఉంటారని భావిస్తున్నారు.

బాంబు దాడి జరిగిన పరిసర ప్రాంతాల్ని పోలీసులు గాలిస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు ఎవరూ ఈ దాడులకు బాధ్యత వహిస్తున్నట్లుగా ప్రకటించలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments