Webdunia - Bharat's app for daily news and videos

Install App

జో బైడెన్ టీమ్‌లో భారత సంతతి వ్యక్తికి చోటు.. అసిస్టెంట్ ప్రెస్ సెక్రటరీగా..

Webdunia
శనివారం, 19 డిశెంబరు 2020 (11:26 IST)
Vedant Patel
అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిసాయి.. ఈ ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓటమిపాలై.. జో బైడెన్ విజయం సాధించారు. జనవరి నెలలో ఆయన అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక, తన టీమ్‌ను పటిష్టం చేసుకునే పనిలో పడ్డారు జో బైడెన్.. తన టీమ్‌లో భారతీయులకు కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారు.
 
తాజాగా.. మరో భారత వ్యక్తికి కీలక బాధ్యతలు అప్పగించారు. వైట్ హౌస్ కమ్యూనికేషన్ అండ్ ప్రెస్ స్టాఫ్‌కు అదనపు సభ్యులను నియమించిన బైడెన్.. భారతీయ-అమెరికన్ వేదంత్ పటేల్‌ను అసిస్టెంట్ ప్రెస్ సెక్రటరీ బాధ్యతలను అప్పజెప్పారు. ప్రస్తుతం బైడెన్ సీనియర్ ప్రతినిధిగా ఉన్న పటేల్.. ఎన్నికల ప్రచార సమయంలో నెవెడా, వెస్ట్రన్ ప్రైమరీ-స్టేట్స్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్‌గా కీలకంగా పనిచేశారు.
 
అంతకుముందు ఇండియన్-అమెరికన్ కాంగ్రెస్ సభ్యురాలు ప్రమీలా జయపాల్ వద్ద డెమోక్రటిక్ నేషనల్ కమిటీలో(వెస్ట్రన్ రీజినల్ ప్రెస్ సెక్రటరీ) కమ్యూనికేషన్స్ డైరెక్టర్‌గా పనిచేశారు. కాగా, బైడెన్ 16 మంది కొత్త వారిని వైట్ హౌస్ కమ్యూనికేషన్స్ అండ్ ప్రెస్ స్టాఫ్‌గా నియమించారు. మొత్తంగా అమెరికా అధ్యక్ష టీమ్‌లో భారతీయులు కీలక బాధ్యతలు అందుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharva: శర్వా, సంయుక్త పై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్

నెలకు 67 రూపాయల ప్యాక్ తో ఖర్చు తక్కువ కిక్ ఎక్కువ అంటున్న ఆహా ఓటీటీ

Balayya: ఎనిమిది నెలలు నిద్రాహారాలు మాని కృషి చేసి సినిమాని రీస్టోర్ చేశారు : బాలకృష్ణ

Kadambari: వ‌దిలేసిన నిస్సాహ‌యుల‌ను మేం చేరదీస్తాం : మనం సైతం కాదంబరి

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments