Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌లో భారీ పేలుడు - 30 మంది మృతి

Webdunia
శుక్రవారం, 4 మార్చి 2022 (16:22 IST)
దాయాది దేశం పాకిస్థాన్‌లో శుక్రవారం భారీ పేలుడు సంభవించింది. ఓ మసీదు వద్ద ఇది జరిగింది. శుక్రవారం కావడంతో ప్రార్థనల కోసం మసీదుకు అనేకమంది వచ్చారు. ఆ సమయంలో ఈ పేలుడు సంభవించడంతో 30 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది గాయపడ్డారు. 
 
వాయువ్య పాకిస్థాన్‌లోని పెషావర్ నగరంలో కొచా రిసల్దార్ ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది. ప్రార్థనల సమయంలో ఈ పేలుడు సంభవించడంతో భారీ ప్రాణనష్టం వాటిల్లింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. 
 
ఈ పేలుళ్ళపై పోలీస్ అధికారి మహ్మద్ సజ్జాద్ ఖాన్ మాట్లాడుతూ, పేలుడు సంభించిన మసీదు, పరిసర ప్రాంతాల్లో అనేక మార్కెట్లు ఉన్నాయని, సాధారణంగా శుక్రవారం ప్రార్థనల సమంయలో రద్దీగా ఉండటంతో ప్రాణనష్టం మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. మరోవైపు పేలుడు సమయంలో కాల్పులు కూడా వినిపించాయని కొందరు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments