Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగ్లాదేశ్‌లో దారుణం.. హోటల్‌కు నిప్పుపెట్టిన ఆందోళనకారులు.. 24 మంది సజీవ దహనం!!

వరుణ్
మంగళవారం, 6 ఆగస్టు 2024 (17:54 IST)
రాజకీయ అస్థిరత నెలకొన్న బంగ్లాదేశ్‌లో దారుణం జరిగింది. ఆందోళనకారులు ఓ హోటల్‌కు నిప్పుపెట్టారు. దీంతో 24 మంది సజీవదహనమ్యయారు. మరికొందరు గాయపడ్డారు. దేశంలో స్వాతంత్ర్య సమరయోధుల వారసులకు రిజర్వేషన్లు అమలు చేసేందుకు ఆ దేశ సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ తీర్పునకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు గత 21 రోజులుగా ఆందోళనలు చేస్తున్నాయి. 
 
ఇవి తారాస్థాయికి చేరుకోవడంతో వందలాది మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు వరకు 440 మంది చనిపోయారు. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు ఆ దేశ సైన్యం రంగంలోకి దిగి తీవ్రంగా కృషి చేస్తుంది. పైగా, దేశ ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేశారు. ఆమె దేశాన్ని వీడిన కొన్ని గంటల్లోనే వంద మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 
 
ఈ నేపథ్యంలో జషోర్ జిల్లాలో ఓ హోటల్‌కు మంగళవారం ఆందోళనకారులు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో 24 మంది సజీవదహనమయ్యారు. మృతి చెందిన వారిలో ఒకరు ఇండోనేషియా పౌరుడు కూడా ఉన్నారు. ఈ హోటల్ అవామీ లీగ్ పార్టీ ప్రధాన కార్యదర్శి  షాహిన్ చక్లాదర్‌కు చెందిన జబీర్ ఇంటర్నేషనల్ హోటల్‌ కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments