Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌లో భారీ పేలుడు - 10 మంది మృత్యువాత

Webdunia
శనివారం, 18 డిశెంబరు 2021 (16:53 IST)
దాయాది దేశమైన పాకిస్థాన్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పది మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఆ దేశ ఓడ రేవుపట్టణంగా గుర్తింపు పొందిన కరాచీ నగరంలో నిత్యం రద్దీగా ఉండే షేర్షా పరాచా చౌక్‌లోని ఓ భవనంలో ఈ పేలుడు సంభవించింది. ఈ భారీ పేలుళ్ళలో 10 మంది వరకు చనిపోయినట్టు ఆ దేశ అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని వారు వెల్లడించారు. 
 
ఈ భారీ పేలుడు ధాటికి సమీపంలోని పలు భవనాలు ధ్వంసమయ్యాయి. పెద్ద సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. పేలుడు జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు ముమ్మరంగా 
సాగుతున్నాయి. 
 
పేలుడు జరిగిన ప్రాంతంలో ఓ బ్యాంకు కూడా ఉన్నట్టు సమాచారం. ప్రాథమిక దర్యాప్తు చేపట్టిన పోలీసులు... గ్యాస్ లీక్ కావడం వల్లే ఈ పేలుడు సంభవినట్టు తెలుస్తుందని తెలిపారు. అయితే, పేలుడు భారీ స్థాయిలో ఉండటంతో ఏదేని ఉగ్ర సంస్థకు చెందిన వారు ఈ పనికి పాల్పడివుంటారని భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mohanlal: ఐమ్యాక్స్‌లో విడుద‌ల‌వుతున్న తొలి సినిమా L2E: ఎంపురాన్‌ : మోహ‌న్ లాల్‌

Chiranjeevi : చిరంజీవి బుగ్గపై ముద్దు పెట్టుకున్న మహిళా అభిమాని- ఫోటో వైరల్

Nidhi Agarwal: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌లో చిక్కిన పవన్ హీరోయిన్ నిధి అగర్వాల్ (video)

Jwala Gutta: గుండె జారి గల్లంతయ్యిందేలో ఐటమ్ సాంగ్‌తో ఇబ్బంది పడ్డాను.. జ్వాలా గుత్తా

Keerthy Suresh సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన కీర్తి సురేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments