Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌లో భారీ పేలుడు - 10 మంది మృత్యువాత

Webdunia
శనివారం, 18 డిశెంబరు 2021 (16:53 IST)
దాయాది దేశమైన పాకిస్థాన్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పది మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఆ దేశ ఓడ రేవుపట్టణంగా గుర్తింపు పొందిన కరాచీ నగరంలో నిత్యం రద్దీగా ఉండే షేర్షా పరాచా చౌక్‌లోని ఓ భవనంలో ఈ పేలుడు సంభవించింది. ఈ భారీ పేలుళ్ళలో 10 మంది వరకు చనిపోయినట్టు ఆ దేశ అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని వారు వెల్లడించారు. 
 
ఈ భారీ పేలుడు ధాటికి సమీపంలోని పలు భవనాలు ధ్వంసమయ్యాయి. పెద్ద సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. పేలుడు జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు ముమ్మరంగా 
సాగుతున్నాయి. 
 
పేలుడు జరిగిన ప్రాంతంలో ఓ బ్యాంకు కూడా ఉన్నట్టు సమాచారం. ప్రాథమిక దర్యాప్తు చేపట్టిన పోలీసులు... గ్యాస్ లీక్ కావడం వల్లే ఈ పేలుడు సంభవినట్టు తెలుస్తుందని తెలిపారు. అయితే, పేలుడు భారీ స్థాయిలో ఉండటంతో ఏదేని ఉగ్ర సంస్థకు చెందిన వారు ఈ పనికి పాల్పడివుంటారని భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కన్నప్ప కామిక్ బుక్ ఫైనల్ చాప్టర్ కాన్సెప్ట్ వీడియో విడుదల

రూ.28 కోట్లు పెట్టి చిత్రాన్ని తీస్తే రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది...

కంగ్రాట్స్ అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్యా, నువ్వు టాలీవుడ్ టాప్ హీరోయిన్ అవ్వాలి

Pawan: హరిహరవీరమల్లుకు డేట్ ఫిక్స్ చేసిన పవన్ కళ్యాణ్

NTR: ఎన్.టి.ఆర్. వార్ 2 గురించి హృతిక్ రోషన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments