Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌లో భారీ పేలుడు - 10 మంది మృత్యువాత

Webdunia
శనివారం, 18 డిశెంబరు 2021 (16:53 IST)
దాయాది దేశమైన పాకిస్థాన్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పది మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఆ దేశ ఓడ రేవుపట్టణంగా గుర్తింపు పొందిన కరాచీ నగరంలో నిత్యం రద్దీగా ఉండే షేర్షా పరాచా చౌక్‌లోని ఓ భవనంలో ఈ పేలుడు సంభవించింది. ఈ భారీ పేలుళ్ళలో 10 మంది వరకు చనిపోయినట్టు ఆ దేశ అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని వారు వెల్లడించారు. 
 
ఈ భారీ పేలుడు ధాటికి సమీపంలోని పలు భవనాలు ధ్వంసమయ్యాయి. పెద్ద సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. పేలుడు జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు ముమ్మరంగా 
సాగుతున్నాయి. 
 
పేలుడు జరిగిన ప్రాంతంలో ఓ బ్యాంకు కూడా ఉన్నట్టు సమాచారం. ప్రాథమిక దర్యాప్తు చేపట్టిన పోలీసులు... గ్యాస్ లీక్ కావడం వల్లే ఈ పేలుడు సంభవినట్టు తెలుస్తుందని తెలిపారు. అయితే, పేలుడు భారీ స్థాయిలో ఉండటంతో ఏదేని ఉగ్ర సంస్థకు చెందిన వారు ఈ పనికి పాల్పడివుంటారని భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments