Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ

Webdunia
శుక్రవారం, 3 జూన్ 2022 (08:18 IST)
ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుక్రవారం ఉదయం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు మరికొందరు కేంద్ర మంత్రులతో భేటీకానున్నారు. గురువారం ఉదయం హస్తినకు వెళ్లిన ఆయన రోజంతా బిజీబిజీగా గడిపారు. తొలి రోజైన గురువారం సాయంత్రం 4.30 గంటలకు ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. 
 
ఆ తర్వాత 5.30 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్, రాత్రి 8 గంటలకు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా, సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలంటూ ఆయన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌ను కోరారు. 
 
ఇదిలావుంటే, శుక్రవారం ఉదయం 10 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అవుతారు. నిజానికి జగన్ ఢిల్లీ బ‌య‌లుదేరే స‌మ‌యానికి అమిత్ షా నుంచి ఎలాంటి అపాయింట్మెంట్ ద‌క్కకున్నా... అమిత్ షాను క‌లిసి తీరాల‌న్న దిశ‌గా జ‌గ‌న్ సాగారు. 
 
ఈ క్ర‌మంలో గురువారం రాత్రి 9 గంట‌ల స‌మ‌యంలో అమిత్ షాతో జ‌గ‌న్ భేటీ అవుతార‌న్న వార్త‌లు వినిపించాయి. అయితే గురువారం జ‌గ‌న్‌తో భేటీకి అమిత్ షా స‌మ‌యం కేటాయించ‌లేద‌ని స‌మాచారం. శుక్ర‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు జ‌గ‌న్‌కు అమిత్ షా అపాయింట్మెంట్ ఇచ్చిన‌ట్లుగా సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments