Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాబూల్‌ నుంచి మెక్సికోకు.. ఎఫ్‌బీ విమానంలో అధికంగా 155 మంది ఆఫ్ఘన్లు

Webdunia
గురువారం, 30 సెప్టెంబరు 2021 (15:33 IST)
ఆప్ఘనిస్థాన్‌ రాజధాని కాబూల్‌ను తాలిబన్లు ఆగస్ట్‌ 15న మెరుపు వేగంతో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జర్నలిస్టులు, సహాయక సిబ్బంది, ఇతర ప్రముఖులతో కలిపి మొత్తం 188 మందిని కాబూల్‌ నుంచి అబుదాబి మీదుగా మెక్సికో సిటీకి తరలించేందుకు ఫేస్‌బుక్‌, లింక్డ్ఇన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్మన్ వంటి వారి ఆర్థిక సహకారంతో ఆగస్ట్‌ 30న ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశారు. 
 
అయితే ఆ విమానం అబుదాబి చేరే సరికి ఊహించని విధంగా 155 మంది ఆఫ్ఘనిస్థాన్‌లు అందులో అధికంగా ఉన్నారు. కామ్ ఎయిర్ సంస్థకు చెందిన ఉద్యోగులు, వారి కుటుంబాలు, మరి కొందరు అందులో ప్రయాణించారు. ఈ విమానం అబుదాబి చేరిన తర్వాత ఈ విషయాన్ని అక్కడి అమెరికా, యూఏఈ అధికారులు గుర్తించారు. జాబితాలోని లేని 155 మంది ఆఫ్ఘన్‌ ప్రయాణికులను అబుదాబిలో వదిలేశారు. జాబితాలో ఉన్న 188 మందిని ఈజిప్ట్‌ ఎయిర్‌కు చెందిన విమానంలో కైరో మీదుగా మెక్సికోకు తరలించారు.
 
కాగా, ఆఫ్ఘనిస్థాన్‌ నుంచి ఇలా అక్రమంగా అబుదాబికి పలు విమానాల్లో తరలివచ్చిన ఆఫ్ఘన్ల సంఖ్య 3,600 వరకు ఉంటుందని అమెరికా, యూఏఈ అధికారులు అంచనా వేస్తున్నారు. సరైన పత్రాలు లేకుండా వచ్చిన వీరి ఇమ్మిగ్రేషన్‌, భద్రతా విధానాలపై ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఆఫ్ఘనిస్థాన్‌ నుంచి తమను సురక్షితంగా తరలించిన ప్రముఖ ప్రైవేట్‌ సంస్థలకు అబుదాబి చేరిన ఆఫ్ఘన్లు ధన్యవాదాలు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments