Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో మళ్లీ గర్జించిన తుపాకీలు - 8 మంది మృతి

Webdunia
బుధవారం, 29 డిశెంబరు 2021 (07:32 IST)
అగ్రరాజ్యం అమెరికాలో తుపాకులు మళ్లీ గర్జించాయి. రెండు వేర్వేరు ప్రాంతాల్లో దుండగులు జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒకరు పోలీస్ అధికారి, ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. మరొకరు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. 
 
నగర శివారులోని గార్లాండ్‌లో ఉన్న ఓ దుకాణంలోకి వచ్చిన దుండగుడు పికప్ ట్రక్‌లో బయటకువెళ్లి, మళ్లీ వెంటనే తిరిగి వచ్చి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఆ వెంటనే అదే ట్రక్కులో పారిపోయాడు. ఈ కాల్పుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. 
 
అదేవిధంగా డెన్వర్‌లో సమీపంలో జరిగిన మరో ఘటనలో పోలీస్ అధికారి ఒకరు ప్రాణాలు కోల్పోయాడు. నగర సమీపంలోని ఓ వాణిజ్య దుకాణంలోకి వచ్చిన ఓ దండుగు కాల్పులు జరిపారు. 
 
ఈ దుండగుడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోయాడు. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రెండు తుపాకీ ఘటనలో ఇద్దరు మహిళల, ఓ పోలీస్ అధికారి ప్రాణాలు కోల్పోవడం విచారకరం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

కమెడియన్‌ ప్రవీణ్‌ బకాసుర రెస్టారెంట్‌ నుంచి జాతీయం లిరికల్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments