Webdunia - Bharat's app for daily news and videos

Install App

నైజీరియాలో ఘోరం - పడవ బోల్తా 76 మంది జలసమాధి

Webdunia
సోమవారం, 10 అక్టోబరు 2022 (09:56 IST)
నైజీరియా దేశంలో మరోమారు పెను విషాదం సంభవించింది. పడవ బోల్తా పడిన 76 మంది జల సమాధి అయ్యారు. ప్రమాదంలో జరిగిన సమయంలో బోటులో 85 మంది వరకు ఉండగా, వీరిలో 76 మంది ప్రాణాలు కోల్పోయారు. నదిలో నీటి ఉధృతి ఒక్కసారిగా పెరగడంతో పడవ నియంత్రణ కోల్పోయి బోల్తాపడింది. గత కొన్ని నెలలుగా నైజీరియా దేశంలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా జరిగిన ప్రమాదంలో 76 మంది చనిపోయారని నైజీరియా అధ్యక్షుడు మహ్మద్ బుహారీ తెలిపారు. 
 
సమాచారం తెలుసుకున్న ఆయన తక్షణం సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దీంతో నదిలో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఈ ప్రమాదం నైజీరియా దేశంలోని అనంబ్రాలో జరిగింది. 85 మంది ప్రయాణికులతో వెళుతుండగా, నదికి ఒక్కసారిగా వరద పోటెత్తడంతో పడవ బోల్తా పడింది. రాష్ట్రంలోని ఒగబరు ప్రాంతంలో 85 మందితో వెళుతున్న పడవ ఒకటి నదిలో మునిగిపోయిందని, ఈ ప్రమాదంలో 76 మంది మృతి చెందారని అధ్యక్షుడు మహ్మద్ బుహారీ కార్యాలయం అధికారింగా వెల్లడించింది. 
 
కాగా, ఈ దేశంలో ఈ తరహా ప్రమాదాలు జరగడం సర్వసాధారణంగా మారాయి. సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, వేగం, పేలవమైన నిర్వహణ వంటి చర్యల కారణంగా ప్రజలు ప్రాణాలు తీస్తున్నాయి. ఇక్కడ వర్షకాలం ప్రారంభమైన తర్వాత ఇప్పటివరకు దాదాపు 300 మంది వరకు ఈ తరహా ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments