Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌లో ఘోరం.. మంటల్లో దహనమైన ప్రయాణికులు

Webdunia
ఆదివారం, 29 జనవరి 2023 (14:13 IST)
పాకిస్థాన్ దేశంలో ఘోరం జరిగింది. బలూచిస్థాన్ ప్రాంతంలో లాస్ బెలాలో కొంతమంది ప్రయాణికులతో వెళుతున్న బస్సు ఒకటి అదుపుతప్పి కాలువలో పడింది. దీంతో బస్సుకు నిప్పు అంటుకున్నాయి. ఈ కారణంగా బస్సులో ప్రయాణిస్తున్న వారిలో 39 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో అనేక మంది మంటల్లో కాలిపోయారు. 
 
ప్రమాద సమయంలో బస్సులో సిబ్బంది సహా 48 మంది ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. బస్సు అదుపుతప్పి కాలువలో పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో చాలా మంది కాలిపోయారని, ఫలితంగా మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా మారిపోయాయని సహాయక సిబ్బంది తెలిపారు. 
 
కాగా, క్వెట్టా నుంచి కరాచీకి వెళుతుండగా, బస్సు ప్రమాదానికి గురైందని అధికారులు తెలిపారు. కొండపై మూల మలుపు వద్ద ఉన్న వంతెన వద్ద బస్సు అదుపు తప్పి, రెయిలింగ్‌ను ఢీకొనడంతో కాలువలో పడిపోయిందని తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో అనేక మంది పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments