Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండోనేషియాను కుదిపేసిన భూకంపం.. 35కి పెరిగిన మృతుల సంఖ్య

Webdunia
శుక్రవారం, 15 జనవరి 2021 (15:39 IST)
Indonesia
కరోనా వైరస్, బర్డ్ ఫ్లూతో ప్రపంచ దేశాలు వణికిపోతుంటే.. ఇండోనేషియాను భూకంపం కుదిపేసింది. ఇండోనేషియాలోని సులవేసి అనే ద్వీపంలో 6.2 తీవ్రతతో భూమి కంపించింది. దీంతో వందకు పైగా కట్టడాలు కూలిపోగా 35 మంది మృతి చెందారు, వందలాది మంది గాయపడ్డారు. అయితే ఈ భూకంపం తెల్లవారుజామున 1.30కి ప్రజలు మంచి నిద్రలో ఉండగా రావడంతో చాలా మంది కూలిపోయిన భవన శిథిలాల కింద చిక్కుకపోయారు. దాంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 
 
ఈ భూ ప్రకంపనల కారణంగా మూడు కొండచరియలు విరిగిపడగా కొన్ని ప్రాంతాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. అలాగే కొన్ని వంతెనలు దెబ్బతిన్నాయి. ఇక ఇదే చోట గత గురువారం మధ్యాహ్నం కూడా 5.9 తీవ్రతతో భూకంపం వచ్చింది. అయితే ఈ ప్రాంతంలో భూకంపాలు ఎక్కువగా వస్తుంటాయి. 2018లో కూడా ఇక్కడ 6.2 తీవ్రతతో భూకంపం రావడంతో సునామీ కూడా వచ్చి వేలాది మంది మృతి చెందారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sridevi: అమ్మా.. కాకినాడ శ్రీదేవి.. కృతిశెట్టి, శ్రీలీల, వైష్ణవిలా కావొద్దు.. కాస్త వెరైటీగా ఆలోచించు..?

Ivana: లవ్ టుడే.. ఆ కళ్ళతో కట్టిపారేసింది.. శ్రీదేవి, మీనా, రాశి బాటలో ఇవానా!?

Tamannaa: నాగసాధువు తమన్నా ప్రమోషన్ కోసం హైదరాబాద్ విచ్చేసింది

SS Rajamouli: మహేష్ బాబు సినిమాకు సంగీతం ఒత్తిడి పెంచుతుందన్న కీరవాణి

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments