Webdunia - Bharat's app for daily news and videos

Install App

12 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. ఆపై నిప్పెట్టి చంపేశారు..

Webdunia
శుక్రవారం, 15 జనవరి 2021 (14:47 IST)
బీహార్‌లో 12 ఏళ్ల బాలికపై ఘోరం జరిగింది. కామాంధులు రెచ్చిపోయి.. బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంకా ఆమెను నిప్పెట్టి హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించి నలుగురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. 
 
వివరాల్లోకి వెళితే.. బీహార్ రాష్ట్రం, ముజఫర్‌పూర్ జిల్లాకు చెందిన కూలీ కార్మికుడికి ఇద్దరు కుమార్తెలున్నారు. జనవరి 3వ తేదీ ఈ కూలీ కార్మికుడు ఇంట్లో లేని సమయంలో నలుగురు ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి.. 12 ఏళ్ల కూలీ కుమార్తెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై అదే గదికి నిప్పు పెట్టారు. ఈ ఘటనలో బాలిక ప్రాణాలు కోల్పోయింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 
 
తన కుమార్తెపై జనవరి 3 తేదీనే కాకుండా.. డిసెంబర్ 23వ తేదీనే అత్యాచారం జరిగిందని.. ఈ తతంగాన్ని వీడియో తీసి.. ఆ వీడియోతో బెదిరింపులకు గురిచేసారని.. పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డారని బాలిక తండ్రి రోదిస్తున్నాడు. ఈ ఘటనకు సంబంధించి నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో వున్న నలుగురి కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments