Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరూ దేశంలో ఘోర బస్సు ప్రమాదం.. 24 మంది మృత్యువాత

Webdunia
ఆదివారం, 29 జనవరి 2023 (13:18 IST)
పెరూ దేశంలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 24 మంది మృత్యువాతపడ్డారు. దక్షిణ అమెరికా ఖండమైన పెరూలో ఆదివారం ఉదయం ఘోర విపత్తు జరిగింది. పెరూ దేశ రాజధాని లిమాలో కొతమంది ప్రయాణికులతో వెళుతున్న బస్సు ఒకటి అదుపుతప్పి భారీ లోయలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఘటనాస్థలిలోనే 24 మంది చనిపోగా, అనేక మంది గాయపడ్డారు. డెవిల్స్ కర్వ్‌గా పిలిచే ప్రమాదకరమైన ప్రదేశంలో ఈ దుర్ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు. 
 
ప్రమాదం జరిగిన సమయంలో 60 మంది ప్రయాణికులు ఉండగా, అందులో 24 మంది చనిపోయినట్టు సహాయక సిబ్బంది వెల్లడించింది. మృతుల్లో కరేబియన్ దేశమైన హైతీకి చెందిన వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. కొరియాంకా టూర్స్ కంపెనీకి చెందిన బస్సు లిమా నుంచి బయలుదేరి ఈక్వెడార్ సరిహద్దుల్లోని టుంబేస్‌కు చేరుకోవాల్సి వుంది. కానీ, బస్సు ఆర్గానోస్ నగరం సమీపంలోని కొండపై ఉండే ప్రమాదకరమలుపు నుంచి పడిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్ పెండ్లి చేసుకుంటాడనేది నిజమేనా?

ఉగాదిన నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ-రిలీజ్ ఫంక్షన్

మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ చేసిన ప్రేక్షకులకు కృతఙ్ఞతలు చెప్పిన చిత్ర బృందం

నితిన్, శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ చిత్రం రివ్యూ

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments