పెరూ దేశంలో ఘోర బస్సు ప్రమాదం.. 24 మంది మృత్యువాత

Webdunia
ఆదివారం, 29 జనవరి 2023 (13:18 IST)
పెరూ దేశంలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 24 మంది మృత్యువాతపడ్డారు. దక్షిణ అమెరికా ఖండమైన పెరూలో ఆదివారం ఉదయం ఘోర విపత్తు జరిగింది. పెరూ దేశ రాజధాని లిమాలో కొతమంది ప్రయాణికులతో వెళుతున్న బస్సు ఒకటి అదుపుతప్పి భారీ లోయలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఘటనాస్థలిలోనే 24 మంది చనిపోగా, అనేక మంది గాయపడ్డారు. డెవిల్స్ కర్వ్‌గా పిలిచే ప్రమాదకరమైన ప్రదేశంలో ఈ దుర్ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు. 
 
ప్రమాదం జరిగిన సమయంలో 60 మంది ప్రయాణికులు ఉండగా, అందులో 24 మంది చనిపోయినట్టు సహాయక సిబ్బంది వెల్లడించింది. మృతుల్లో కరేబియన్ దేశమైన హైతీకి చెందిన వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. కొరియాంకా టూర్స్ కంపెనీకి చెందిన బస్సు లిమా నుంచి బయలుదేరి ఈక్వెడార్ సరిహద్దుల్లోని టుంబేస్‌కు చేరుకోవాల్సి వుంది. కానీ, బస్సు ఆర్గానోస్ నగరం సమీపంలోని కొండపై ఉండే ప్రమాదకరమలుపు నుంచి పడిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments